ETV Bharat / state

'అవాస్తవాలతో చంద్రబాబు రైతులను ఆందోళనకు గురి చేస్తున్నారు'

author img

By

Published : May 20, 2020, 11:33 PM IST

వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు
వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు

తెదేపా అధినేత చంద్రబాబు లేనిపోని అవాస్తవాలతో రైతులను గందరగోళానికి గురి చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు విమర్శించారు.

ఉద్యాన పంటలకు సరైన గిట్టుబాటు ధర లభించడం లేదంటూ ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు వ్యాఖ్యానించారు. లేనిపోని అవాస్తవాలతో రైతులను చంద్రబాబు గందరగోళపరుస్తున్నారని మంత్రి ఆరోపించారు. తెదేపా హయాంలో ఏ ఒక్క పంటకు సరైన మద్దతు ధర దక్కలేదని ఆయన విమర్శించారు. తెదేపా హయాంలో ఏ రోజూ రైతుల గురించి పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు వారి గురించి మాట్లాడడం శోచనీయమన్నారు.

ఇవీ చదవండి

లాక్​డౌన్​ అడ్డుపెట్టుకుని వైకాపా అవినీతికి పాల్పడింది: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.