ETV Bharat / state

బాబోయ్!​ ఇది రైలు ప్రయాణం కాదు.. నరకయాతనే అంటున్న ప్రయాణికులు

author img

By

Published : Feb 4, 2023, 1:34 PM IST

Water Problem in Train
రైలులో నీటి సమస్య

Passengers faced Water Problem : కాకినాడ నుంచి బయల్దేరిన రైలులో సౌకర్యాలు లేక ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల తలెత్తిన సమస్యతో తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. ఇలా నిర్లక్ష్యం వహించి ప్రయాణికులను ఇబ్బంది పెట్టడం సరైంది కాదని ఆవేదన వ్యక్తం చేశారు.

Passengers Faced Water Problem : రైలు ప్రయాణం అంటే గంటల తరబడి రైలులోనే కూర్చోని ప్రయాణించాల్సి ఉంటుంది. సుదూర ప్రాంతాలకు వెళ్లడానికి ప్రయాణికులు రైలు మార్గాన్ని ఎంచుకుంటారు. రోడ్డు మార్గం కన్నా.. రైలు మార్గం సౌకర్యవంతంగా ఉంటుందని రైళ్లలో ప్రయాణించటానికి ప్రజలు మొగ్గుచూపుతారు. అయితే కాకినాడ నుంచి బయల్దేరిన కాకినాడ - విశాఖపట్నం రైలులో మాత్రం ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. ప్రయాణ సమయంలో ట్రైన్​లో సరైన సౌకర్యాలు లేకపోవటంతో నరకయాతను అనుభవించారు.

కాకినాడ - విశాఖపట్నం ఎక్స్​ప్రెస్​ శనివారం ఉదయం కాకినాడ నుంచి బయల్దేరింది. అయితే రైలు సరైన టైమ్​కు అటో ఇటో నడుస్తున్న పట్టించుకొని ప్రయాణికులు.. రైలులో నీళ్లు రాకపోవటంతో ఇబ్బందులు పడ్డారు. చేతులు శుభ్రం చేసుకోవటానికి వాష్​ బేసిన్​లో నీళ్లు రాలేదని వాపోయారు. అలాగే మరుగుదొడ్లలో సైతం నీళ్లు రాకపోవటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోన్నామని అంటున్నారు. నీళ్లు రాకపోవటం.. మరుగుదొడ్లు శుభ్రంగా లేక దుర్వాసన రావటంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ఈ విధంగా నిర్లక్ష్యం వహించటం సరైంది కాదని వాపోయారు.

రైలు మొత్తం ఇదే పరిస్థితి ఉందని.. ఏ భోగిలో నీళ్లు రావటం లేదని ప్రయాణికులు అన్నారు. రోజు వెళ్లే ప్రయాణికులు మాత్రం అప్పుడప్పుడు ఇలాంటి పరిస్థితి వస్తుందని అంటున్నారు. దుర్వాసన భరించలేని విధంగా ఉందని అంటున్నారు.

బాబోయ్!​ ఇది రైలు ప్రయాణం కాదు

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.