పార్శిల్ యంత్రం షార్ట్ సర్క్యూట్ కారణంగా.. విద్యుదాఘాతంతో గుంటూరు జిల్లా రేపల్లెలో ఓ మహిళ మృతి చెందింది. కుమార్తె ఇంట్లోని బిర్యానీ పాయింట్లో చేదోడువాదోడుగా పనిచేస్తున్న బొడ్డు శివ కుమారి.. ఆ సమయంలో యంత్రంతో పనిచేస్తూ ఉంది. ఆమె విద్యుదాఘాతానికి గురైనట్లు గమనించిన కుటుంబ సభ్యులు.. బాధితురాలిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శివకుమారి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
ఇదీ చదవండి: