ETV Bharat / state

రాజధానిగా అమరావతినే కొనసాగించాలి: దళిత బహుజన ఐకాస

author img

By

Published : Oct 10, 2020, 5:44 PM IST

దళిత బహుజన ఐకాస
దళిత బహుజన ఐకాస

రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని దళిత బహుజన ఐకాస డిమాండ్ చేసింది. గుంటూరు జిల్లా వెలగపూడిలోని రాజధాని పరిరక్షణ సమితి కార్యాలయంలో.. దళిత బహుజన రౌండ్​ టేబుల్ సమావేశానికి నిర్వహించారు. అమరావతి రైతుల ఆందోళనకు అండగా ఉండాలని ఐకాస తీర్మానం చేసింది.

ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని దళిత బహుజన ఐకాస డిమాండ్ చేసింది. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడిలోని రాజధాని పరిరక్షణ సమితి కార్యాలయంలో దళిత బహుజన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. వైకాపా మినహా అన్ని పార్టీలకు చెందిన ఎస్సీ నేతలు హాజరయ్యారు.

రేపు, ఎల్లుండి రాజధాని రైతులు నిర్వహించే ఆందోళనల్లో దళిత బహుజన ఐకాస నేతలు పాల్గొనాలని నిర్ణయించారు. రైతులు చేపట్టే ఉద్యమానికి అండగా నిలవాలని ఈ సమావేశంలో తీర్మానించారు.

ఇదీ చదవండి:

'మళ్లీ పుట్టిన గాంధీ.. స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.