ETV Bharat / state

బస్సు, ద్విచక్ర వాహనం ఢీ...ముగ్గురికి గాయాలు

author img

By

Published : Apr 25, 2021, 4:32 PM IST

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు

గుంటూరు జిల్లా వినుకొండ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని వినుకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

గుంటూరు జిల్లా వినుకొండలో మండలంలోని చీకటిపాలెంలో ద్విచక్రవాహనాన్ని.. బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కొప్పుకొండ గ్రామానికి చెందిన మర్రి వెంకట రామయ్య, మర్రి వెంకటరమణ, మౌనిక అనే చిన్నారి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. వినుకొండ నుంచి శ్రీ శైలం వెళ్తున్నా నరసరావుపేట డిపో ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంకటరమణయ్యకు కాళ్లు విరిగాయి. స్థానికుల సహాయంతో క్షత్రగాత్రులను అంబులెన్స్​లో వినుకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్ తరలించాలని వైద్యులు సూచించారు.

ఇదీ చదవండి:

అప్పు తీర్చమన్నందుకు సినీఫక్కీలో బావపై హత్యాయత్నం

ఆదర్శ దంపతులు: మరణంలోనూ ఒక్కటై..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.