ETV Bharat / state

గుంటూరు జీజీహెచ్​లో మమోగ్రఫీ సేవలు ప్రారంభం

author img

By

Published : Dec 13, 2022, 12:36 PM IST

వచ్చే ఉగాది నుంచి రాష్ట్రంలో ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం
వచ్చే ఉగాది నుంచి రాష్ట్రంలో ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం

mammography service in guntur: క్యాన్సర్ వైద్యం కోసం బయట రాష్ట్రాలకు వెళ్లకుండా బ్రెస్ట్ క్యాన్సర్​ని గుర్తించే డిజిటల్ మమోగ్రఫీ పరికరాన్ని రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా గుంటూరు జీజీహెచ్​లో అందుబాటులోకి వచ్చిందని వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజని వెల్లడించారు. వచ్చే ఏడాది ఉగాదిన రాష్ట్రంలో ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేతులమీదుగా ప్రారంభించనున్నారు.

mammography-service-in-guntur: ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని వచ్చే ఏడాది ఉగాదిన రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్​మోహన్​రెడ్డి ప్రారంభిస్తారని వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజని వెల్లడించారు. జీజీహెచ్ నాట్కో కేంద్రంలో గడ్డిపాటి కస్తూరిదేవి, రామమోహన్రావు, శివరామకృష్ణ సౌజన్యంతో ఏర్పాటు చేసిన డిజిటల్ మామోగ్రాఫి పరికరాన్ని ఆమె ప్రారంభించారు. బ్రెస్ట్ క్యాన్సర్​ను ముందే గుర్తించే మామోగ్రఫీ పరికరం రాష్ట్రంలో మొదటిసారిగా గుంటూరు జీజీహెచ్​లో అందుబాటులోకి వచ్చిందని మంత్రి రజని చెప్పారు. విశాఖలో క్యాన్సర్ చికిత్సలకు హోమీ బాబా ఆసుపత్రితో ఒప్పందం చేసుకున్నామని, క్యాన్సర్ వైద్యం కోసం బయట రాష్ట్రాలకు వెళ్లకూడదన్న లక్ష్యంతో పని చేస్తున్నామని అన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.