ETV Bharat / state

పంచాయితీల నిధుల మళ్లింపుపై హైకోర్టు అసహనం

author img

By

Published : Feb 8, 2023, 4:23 PM IST

Updated : Feb 8, 2023, 5:26 PM IST

HC
హైకోర్టు

HC Funds of Panchayats: పంచాయితీల నిధుల మళ్లింపు వ్యవహారంలో.. రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేయకపోవడంపై.. హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వం నిధులు మళ్లించిందంటూ రాష్ట్ర పంచాయితీ ఛాంబర్ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా ఈ పిటిషన్​పై ఇవాళ జరిగిన విచారణలో పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది వీరారెడ్డి వాదనలు వినిపించారు.

HC Funds of Panchayats: పంచాయితీ నిధులను ప్రభుత్వం మళ్లించిందంటూ రాష్ట్ర పంచాయితీ ఛాంబర్ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్​పై ఇవాళ జరిగిన విచారణలో పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది వీరారెడ్డి వాదనలు వినిపించారు. పంచాయితీలకు వచ్చిన నిధులను ప్రభుత్వం డ్రా చేసుకోవడంతో గ్రామాభివృద్ది కుంటుపడుతుందని పేర్కొన్నారు. పంచాయితీల్లో నిధుల కొరతతో అసలు పనులు జరగడం లేదన్నారు.

తమ నిధులను వాడేసుకున్న ప్రభుత్వం వెంటనే వాటిని పంచాయితీ అకౌంట్లకు బదిలీ చేయాలని పిటిషనర్ కోరారు. నిధులను ఒక అకౌంట్​లో నుంచి మరో అకౌంట్​కు ఎలా బదిలీ చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. ఒక్కోసారి ఒక అకౌంట్ నుంచి మరో అకౌంట్​కు బదిలీ చేసినా, తరువాత మళ్లీ నిధులను ఒరిజినల్ అకౌంట్​కు తీసుకురావాలి కదా అని ప్రశ్నించింది.

మూడు నెలలు అయినా కౌంటర్ దాఖలు చేయకపోవడం పట్ల హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. వెంటనే కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశించింది. కేసు తదుపరి విచారణను వాయిదా వేసింది.

పంచాయితీల నిధుల మళ్లింపుపై హైకోర్టు అసహనం

పంచాయితీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోగా, కేంద్రం ఇచ్చిన నిధులను సైతం దొంగలించడం దుర్మార్గం న్యాయస్థానంలో చీవాట్లు తింటున్నా ప్రభుత్వానికి బుద్ధి రావడం లేదు. పంచాయితీలకు రావాల్సిన నిధులపై పోరాటం కొనసాగుతుంది - ఏపి సర్పంచ్‌ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, వైవీబి రాజేంద్రప్రసాద్‌

ఇవీ చదవండి:

Last Updated :Feb 8, 2023, 5:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.