ETV Bharat / entertainment

ఆగిపోయిన హిట్​ కాంబో మూవీ.. 5 ఏళ్ల తర్వాత రిలీజ్​కు రెడీ!

author img

By

Published : Feb 8, 2023, 3:27 PM IST

Updated : Feb 8, 2023, 4:27 PM IST

గౌతమ్​ మేనన్​- చియాన్​ విక్రమ్-హరీశ్​ జయరాజ్​​ కాంబోలో తెరకెక్కుతూ ఆగిపోయిన ధృవ నక్షత్రం సినిమా మళ్లీ సెట్స్​పైకి వెళ్లేందుకు సిద్ధమవుతోందని తెలుస్తోంది. 2017లో అనౌన్స్​ చేసిన ఈ చిత్రాన్ని ఈ వేసవికి విడుదుల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఆ వివరాలు..

dhruva natchathiram release
ధృవ నక్షత్రం రిలీజ్​కు రెడీ

ఇండస్ట్రీలో చాలా సినిమాలు సెట్స్​పైకి వెళ్లి ఆగిపోతుండటం చూస్తూనే ఉండటం. వాటిలో కొన్ని కొన్నాళ్ల తర్వాత మళ్లీ సెట్స్​పైకి వచ్చి రిలీజ్​కు సిద్ధమవుతుంటాయి. తాజాగా ఇప్పుడు మరో స్టార్ హీరో సినిమా రిలీజ్​కు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అదే కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్, క్రియేటివ్ డైరెక్టర్ గౌతమ్ మేనన్ దర్శకత్వంలో ధృవనక్షత్రం. స్పై యాక్షన్ థ్రిల్లర్​గా రూపుదిద్దుకున్న ఈ సినిమాను 2017లో ప్రకటించారు. దీనికి హరీశ్ జయ రాజ్​ సంగీత దర్శకుడు. ఈ ముగ్గురు కాంబో అనగానే అప్పట్లో సినిమాపై సూపర్ బజ్​ క్రియేట్ అయింది. విక్రమ్​ క్రేజ్​తో పాటు మరోవైపు గౌతమ్​ మేనన్​-హరీశ్ జయరాజ్​ కాంబో సినిమాలకు స్పెషల్​ క్రేజ్​ ఉంటుంది. వీరిద్దరి కాంబోలో వచ్చిన చెలి, ఘర్షణ వంటి పలు సినిమాలు కూడా మ్యూజిక్​ పరంగా సెన్షేషనల్​ హిట్​ అయ్యాయి. దీంతో ధృవనక్షత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. కానీ ఆ తర్వాత అనివార్య కారణాల వల్ల ఈ చిత్రం ఆగిపోయింది.

ఆ తర్వాత ఈ సినిమా గురించి ఎక్కడ కూడా ఊసే వినిపించలేదు. అంతే కాకుండా గౌతమ్,​ విక్రమ్, హరీశ్​.. ముగ్గురూ ​ వేర్వేరుగా పలు ప్రాజెక్టులతో బిజీ అయిపోయారు. ఇక ఈ సినిమా పట్టాలెక్కదు అని ఫిక్స్​ అయిపోయి మర్చిపోయిన సందర్భంలో తాజాగా ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఈ చిత్రం త్వ‌ర‌లోనే థియేట‌ర్ల‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్​. దర్శకుడు గౌతమ్ మీనన్ ఈ సినిమా ప్యాచ్ వర్క్ షూట్‌ను త్వరలోనే కంప్లీట్​ చేయనున్నట్లు సమాచారం. అంతే కాకుండా ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులను టీమ్ ఏకకాలంలో పూర్తి చేస్తోందని టాక్ వినిపిస్తోంది​.

ఇక స్పై థ్రిల్లర్​గా రూపొంతున్న ఈ సినిమా కథేంటంటే.. జాతీయ భద్రతా ఏజెన్సీ కోసం పనిచేసే 10 మంది రహస్య ఏజెంట్ల బృందం చుట్టూ ఈ కథ తిరుగుతుంటుంది. చియాన్ విక్రమ్ టీమ్​కు హెడ్​గా కనిపించగా.. ప్రముఖ నటులు రాధిక శరత్‌కుమార్, సిమ్రాన్, ఆర్ పార్తిబన్, దివ్యదర్శిని, మున్నా, వంశీకృష్ణ తదితరులు ఇతర పాత్రలో నటించారు.

Last Updated :Feb 8, 2023, 4:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.