ETV Bharat / state

ఇంజనీరింగ్ విద్యార్థులకు గంజాయి అమ్ముతున్న ఐదుగురు అరెస్టు

author img

By

Published : Mar 18, 2021, 5:58 PM IST

marijuana to engineering students
గంజాయి అమ్ముతున్న ఐదుగురు అరెస్టు

ఇంజనీరింగ్ విద్యార్థులను టార్గెట్ చేస్తూ గంజాయి అమ్ముతున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 5కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.

గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని ఇంజనీరింగ్ కళాశాలలో గంజాయి విక్రయిస్తున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 5కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. డీవీసీ కాలనీకి చెందిన వెంకట సాయి.. నక్కల రవి కుమార్ అనే లారీడ్రైవర్ సహాయంతో.. విశాఖపట్నం నుంచి గంజాయిని తీసుకొచ్చినట్లు విచారణలో తేలిందన్నారు. వేణుకుమార్, గోపి మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి.. వట్టిచెరుకూరు మండలంలోని కిట్స్ ఇంజనీరింగ్ కాలేజ్, నంబూరు వీవీఐటీ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు అమ్ముతున్నట్లు గుర్తించామన్నారు. వీరితో పాటుగా మాదక ద్రవ్యాలకు బానిసలైన యువకులు, ఆటో డ్రైవర్లకు విక్రయిస్తున్నట్లు తేలిందన్నారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇలాంటి అసాంఘిక సంఘటనలు గుర్తించినట్లయితే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు.

ఇవీ చూడండి...: మాచర్ల పురపాలక సంఘం ఛైర్మన్​గా తురక కిషోర్

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.