ETV Bharat / state

సీపీఎస్ పై ప్రభుత్వంతో చర్చలకు వెళ్లొద్దని ఉద్యోగ సంఘం నిర్ణయం

author img

By

Published : Dec 6, 2022, 8:54 AM IST

Updated : Dec 6, 2022, 9:32 AM IST

ప్రభుత్వంతో చర్చలకు వెళ్లొద్దని సీపీఎస్ ఉద్యోగ సంఘం నిర్ణయం
ప్రభుత్వంతో చర్చలకు వెళ్లొద్దని సీపీఎస్ ఉద్యోగ సంఘం నిర్ణయం

08:48 December 06

ప్రభుత్వం పాత ప్రతిపాదనలపైనే చర్చించే అవకాశం ఉందని బహిష్కరణకు నిర్ణయం

CPS ISSUE : సీపీఎస్​ అంశంపై చర్చలకు ఉద్యోగ సంఘాలను ప్రభుత్వం ఆహ్వానించిన వేళ.. సీపీఎస్​ ఉద్యోగ సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం పాత ప్రతిపాదనలపైనే చర్చించే అవకాశం ఉందని భావించిన ఉద్యోగ సంఘాలు.. చర్చలకు వెళ్లొద్దనే నిర్ణయం తీసుకున్నాయి.

ఇదీ జరిగింది: CPS Meeting: సీపీఎస్ అంశంపై చర్చలకు రావాలని రాష్ట్ర ప్రభుత్వం మరోమారు ఉద్యోగ సంఘాలను ఆహ్వానించింది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు విజయవాడలోని స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యాలయంలో ఈ చర్చలు జరుగనున్నట్టు ఆర్ధికశాఖ ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్రంలోని 20 ఉద్యోగ సంఘాల నేతలు, ప్రతినిధులకు ఆర్ధికశాఖ సమాచారం పంపింది. సీపీఎస్​పై ఏర్పాటైన మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాలతో చర్చించనుంది. ప్రధాన ఉద్యోగ సంఘాలతో పాటు ఉపాధ్యాయ సంఘాలు, సీపీఎస్ ఉద్యోగుల అసోసియేషన్లనూ ప్రభుత్వం చర్చలకు పిలిచింది. సీపీఎస్ అంశంపై మాత్రమే చర్చించేందుకు రావాలని ఆర్ధిక శాఖ ఆ నోట్​లో పేర్కొన్నప్పటికీ ప్రభుత్వం ఏ మెలిక పెడుతుందోనని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఇవీ చదవండి:

Last Updated :Dec 6, 2022, 9:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.