ETV Bharat / state

అప్పుల బాధ భరించలేక రైతు ఆత్మహత్య

author img

By

Published : Apr 14, 2021, 10:12 PM IST

Debt ridden farmer commits suicide at gundlapalli
పరుగుల మందుతాగి రైతు ఆత్మహత్య

అప్పుల బాధ భరించలేక ఓ రైతు పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన గుంటూరు జిల్లా గుండ్లపల్లిలో జరిగింది.

గుంటూరు జిల్లా నకరికల్లు మండలం గుండ్లపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన రైతు కాశిమళ్ల బిక్షం.. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. బిక్షంకు ఉన్న 2 ఎకరాల పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే పంట దిగుబడి సరిగా రాకపోవడంతో చేసిన అప్పలులు తీర్చలేకపోయాడు. గత కొంత కాలంగా అప్పులతో ఇబ్బంది పడేవాడని.. ఈ క్రమంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని గ్రామస్థులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

మొన్న రాళ్లదాడి చేశారు.. ఇవాళ కరెంట్ నిలిపేశారు: చంద్రబాబు

జగద్గిరిగుట్టలో తుపాకీతో యువకుడు వీరంగం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.