ETV Bharat / state

గుంటూరు: నార్త్ ప్యారిస్ చర్చిలో రెండు వర్గాల మధ్య ఘర్షణ

author img

By

Published : Oct 30, 2022, 8:13 AM IST

Updated : Oct 30, 2022, 12:23 PM IST

నార్త్ ప్యారిస్ చర్చిలో రెండు వర్గాల మధ్య ఘర్షణ
నార్త్ ప్యారిస్ చర్చిలో రెండు వర్గాల మధ్య ఘర్షణ

08:10 October 30

ఘర్షణకు దిగిన పరదేశి బాబు, శ్యామ్ సంపత్ వర్గాల పాస్టర్లు

గుంటూరులోని చర్చిలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ

గుంటూరు ఏఈఎల్‌సీ సంస్థలో వివాదాలు ముదిరాయి. నార్త్ ప్యారిస్ చర్చిలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ప్రార్థన చేసే అధికారం తమకే ఉందంటూ పరదేశి బాబు, శ్యామ్ సంపత్ పాస్టర్లకు చెందిన ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. పరదేశి బాబు వర్గానికి చెందిన పాస్టర్ బాబురావు చర్చిలో ప్రార్థనలు నిర్వహిస్తుండగా.. శ్యామ్ సంపత్ వర్గం పాస్టర్ కెన్నెడీ తమకు కోర్టు అనుమతిచ్చిందని చర్చిలోకి వచ్చారు. ఇరు వర్గాలు పరస్పరం కుర్చీలు విసురుకున్నారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి. రంగంలోకి దిగిన పోలీసులు లాఠీచార్జ్‌ చేసి ఘర్షణకు దిగిన ఇరువర్గాలను చెదరగొట్టారు. చర్చి వద్ద భారీగా పోలీసులను మోహరించారు.


ఇవి చదవండి:

Last Updated :Oct 30, 2022, 12:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.