ETV Bharat / state

'పోలవరం నిర్వాసితులకు పూర్తి ప్యాకేజీ చెల్లింపునకు చర్యలు'

author img

By

Published : Dec 21, 2020, 6:47 PM IST

polavaram authority ceo on compensation to polavaram rehabilitants
దేవీపట్నం మండలంలో పీపీఏ సీఈఓ పర్యటన

పోలవరం నిర్వాసితుల కాలనీల నిర్మాణం వచ్చే మార్చిలోగా పూర్తి చేస్తామని ప్రాజెక్టు అధారిటీ సీఈవో చంద్రశేఖర్ వెల్లడించారు. నిర్వాసితులకు పూర్తి స్థాయిలో ప్యాకేజీ చెల్లింపునకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

పోలవరం నిర్వాసితులకు పూర్తి స్థాయిలో ప్యాకేజీ చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని పోలవరం ప్రాజెక్టు అధారిటీ సీఈవో చంద్రశేఖర్ తెలిపారు. సోమవారం దేవీపట్నం మండలం ఇందుకూరుపేట, కంబలం పాలెంలోని పునరావాస కాలనీలను ఆయన సందర్శించారు.

కాలనీ నిర్మాణాలను వచ్చే మార్చిలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశంచారు. భూములకు సంబంధించి ప్యాకేజీని చెల్లించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ప్రవీణ్ ఆదిత్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

సామాన్యుల ప్రయోజనాలు కాపాడేందుకే.. భూ సర్వే: సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.