ETV Bharat / state

'అర్హతే లక్ష్యంగా ప్రభుత్వ పథకాల అమలు'

author img

By

Published : Jul 3, 2020, 7:54 PM IST

Allotment of plots by lottery  by Minister Pnipe Vishwaroop in Kakinada, East Godavari district
కాకినాడలో లాటరీ ద్వారా ప్లాట్ల కేటాయింపును ప్రారంభించిన మంత్రి పినిపే విశ్వరూప్

తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో లాటరీ ద్వారా ప్లాట్ల కేటాయింపును మంత్రి పినిపే విశ్వరూప్ ప్రారంభించారు. అర్హతే లక్ష్యంగా సీఎం జగన్ ప్రభుత్వ పథకాలు అమల చేస్తున్నారని ఆయన అన్నారు.

ముఖ్యమంత్రి జగన్ అర్హతే లక్ష్యంగా ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. ఈనెల 8న ఇంటిపట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా లాటరీద్వారా ప్లాట్ల కేటాయింపు కార్యక్రమాన్ని తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఆయన ప్రారంభించారు. లబ్ధిదారులకు టోకెన్లు అందించారు. కాకినాడ నగరంలో 32వేల మందికి ఇంటిపట్టాలు ఇస్తుండటం సామాన్య విషయం కాదని విశ్వరూప్‌ అన్నారు. గత ప్రభుత్వం పథకాలను ప్రచారానికి వాడుకుంటే... వైకాపా ప్రభుత్వం పార్టీలకు అతీతంగా అర్హులకే పథకాలు అందజేస్తోందని అన్నారు.

ఇదీ చదవండి: పారదర్శకంగా 'ఆప్కోస్' ద్వారా పొరుగు సేవల ఉద్యోగాల భర్తీ: సీఎం జగన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.