ETV Bharat / state

'రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్నేహితుల మృతి'

author img

By

Published : Feb 24, 2021, 4:06 AM IST

friends died in road accident at anatapur district
'రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్నేహితుల మృతి

అనంతపురం జిల్లా చిగిచెర్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. టీటీసీ కోచింగ్​ పూర్తి చేసుకుని స్నేహితులిద్దరూ.. తిరిగి స్వస్థలాలకు ద్విచక్రవాహనంలో ప్రయాణిస్తున్న సమయంలో ఘటన చోటుచేసుకుంది.

అనంతపురం జిల్లా ధర్మవరం మండలం చిగిచెర్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతులు ఇద్దరూ స్నేహితులు. వారిద్దరూ అనంతపురం నుంచి ధర్మవరం వైపు ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తుండగా.. ఎదురుగా వస్తున్న వ్యాన్ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది.

ఈ ఘటనలో మృతి చెందిన యువకులు జగదీష్ (22), హోసన్న (23) లుగా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ టీటీసీ పూర్తి చేసి అనంతపురంలో డీఎస్సీ కోచింగ్ తీసుకుంటున్నారు. కోచింగ్ పూర్తి కావడంతో అనంతపురం నగరానికి చెందిన హోసన్న ద్విచక్ర వాహనంలో.. జగదీశ్​ను స్వగ్రామమైన కొత్తచెరువు మండలం నారే పల్లికి తీసుకెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.

ఇదీ చదవండి:

బంధువులతో కలిసి భర్తను హతమార్చిన భార్య.. ఆలస్యంగా వెలుగులోకి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.