వైకాపా ప్రభుత్వంలో సామాజిక న్యాయం లేదని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విమర్శించారు. అనంతపురం జిల్లా హిందూపురం మున్సిపాలిటీలో పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు. తెదేపా ప్రభుత్వంలో హిందూపురంలో నీటి సమస్యను తీర్చామని గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో గెలిపిస్తే ఉచితంగా తాగునీటి కనెక్షన్ ఇచ్చేలా చూస్తామని చెప్పారు. ఎన్నికల ముందు హామీలిచ్చిన వైకాపా ప్రభుత్వం హోదా విషయాన్ని మరిచిపోయిందని దుయ్యబట్టారు. పేదవారి కోసం అమల్లోకి తెచ్చిన అన్నా క్యాంటీన్లను మూసివేసిందని విమర్శించారు. వాటిని త్వరలోనే పునఃప్రారంభిస్తామన్నారు. ఈ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు.
రెండేళ్ల వైకాపా పాలనలో ఒక్క రూపాయి పెట్టుబడి తేలేదు. ప్రత్యేక హోదా సాధిస్తామన్న హామీ నిలబెట్టుకోలేదు. రెండేళ్లలో ఐదుగురు మున్సిపల్ కమిషనర్లను మార్చారు. వ్యవస్థను బెదిరించే అప్రజాస్వామిక ప్రభుత్వం నడుస్తోంది- బాలకృష్ణ, హిందూపురం ఎమ్మెల్యే
ఇదీ చదవండి