ETV Bharat / sports

'ఆ రూల్స్​ ఉంటే సచిన్​ లక్షకుపైగా రన్స్​ చేసేవాడు'

author img

By

Published : Jan 29, 2022, 8:43 AM IST

Shoaib Akthar Sachin Tendulkar: క్రికెట్​లో ప్రస్తుతం ఉన్న నిబంధనలు బ్యాటర్లకు అనుకూలంగా ఉన్నాయంటూ వస్తున్న వాదనలకు మద్దతు పలికాడు పాక్​ మాజీ క్రికెటర్​ షోయబ్​ అక్తర్​. ఈ రూల్స్​ తాము ఆడే రోజుల్లో ఉండి ఉంటే భారత దిగ్గజ క్రికెటర్​ సచిన్​ తెందుల్కర్​ లక్షకు పైగా పరుగులు చేసేవాడని అభిప్రాయపడ్డాడు.

Shoaib Akthar Sachin Tendulkar
సచిన్​ షోయబ్​ అక్తర్​

Shoaib Akthar Sachin Tendulkar: ఐసీసీ తీసుకొస్తున్న నిబంధనలు బ్యాటర్లకు అనుకూలంగా ఉంటున్నాయని కొద్దికాలంగా వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నిబంధన వల్ల ఆట సహజత్వాన్ని కోల్పోతుందని విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ విషయమై మాట్లాడాడు పాక్​ మాజీ పేసర్​ షోయబ్​ అక్తర్​. క్రికెట్​లో ఉన్న ప్రస్తుత నిబంధనలు తాము ఆడే రోజుల్లో ఉండి ఉండే భారత దిగ్గజ క్రికెటర్​ సచిన్​ తెందుల్కర్​ మరిన్ని పరుగులు చేసేవాడని అన్నాడు. లక్షకు పైగా రన్స్​ చేసేవాడని అభిప్రాయపడ్డాడు.

"మీకు రెండు కొత్త బంతులు ఉన్నాయి. నిబంధనలను కఠినం చేశారు. ఈ మధ్య కాలంలో బ్యాటర్లకు అనుకూలంగా నిబంధనలను రూపొందించారు. ఇప్పుడు మూడు రివ్యూలు ఇస్తున్నారు. సచిన్​.. వసీం అక్రమ్​, వాకర్​ యూనిస్​, షేన్​ వార్న్​, బ్రెట్​ లీ, ముత్తయ్య మురళీధరన్​ వంటి భీకర్ల బౌలర్లను ఎంతో సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. అందుకే అతడిని నేను టఫ్​ బ్యాటర్ అంటాను. ఇప్పుడున్న నిబంధనలు మా రోజుల్లో ఉండి ఉంటే అతడు లక్ష పరుగులు చేసేవాడు."

-అక్తర్​, పాక్​ మాజీ క్రికెటర్​.

క్రికెట్ బ్యాటింగ్​ ఆధారిత క్రీడ అయిపోయిందని, కొత్త నిబంధనల వల్ల బౌలర్లకు ఎక్కువ ఉపయోగాలు లేవని అన్నాడు అక్తర్​.

ఇదే విషయమై మాజీ కోచ్​ రవిశాస్త్రి మాట్లాడుతూ.. "బ్యాట్​, బంతి మధ్య ఆసక్తికర పోరు ఉండాలి. వన్డేల్లో రెండు కొత్త బంతులు ఉండటం బౌలర్లకు కష్టంగా మారింది. టెస్టుల్లో మూడు రివ్యూలు ఉండటం ఆమోదయోగ్యం కాదు" అని అన్నాడు.

ఇదీ చూడండి:

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

నీటిలో మునుగుతూ.. అందాల్లో ముంచెత్తుతూ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.