ETV Bharat / sports

రోహిత్ కామెంట్స్​పై ఐసీసీ గరం!- చిక్కుల్లో కెప్టెన్?

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 8, 2024, 3:54 PM IST

Rohit Sharma Icc Controversy
Rohit Sharma Icc Controversy

Rohit Sharma Icc Controversy: రోహిత్ శర్మ ఇటీవల క్రికెట్ పిచ్​లపై బహిరంగంగా చేసిన వ్యాఖ్యలను ఐసీసీ తీవ్రంగా ఖండించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రోహిత్​పై ఐసీసీ చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Rohit Sharma Icc Controversy: టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆంక్షలు విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రీసెంట్​గా సౌతాఫ్రికా పర్యటనలో కేప్​టౌన్ మ్యాచ్​ తర్వాత క్రికెట్ పిచ్​లపై రోహిత్ బహిరంగంగా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆతిథ్య​ దేశాన్ని కాకుండా పిచ్‌ను చూసి రేటింగ్‌ ఇవ్వాలని అతడు పిచ్​ రిఫరీలకు సూచించాడు. అయితే రోహిత్ వ్యాఖ్యలను ఐసీసీ సీరియస్​గా తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి రోహిత్ చెప్పినట్లుగా రేటింగ్ విషయాన్ని ఐసీసీ పరిష్కరిస్తుందా? లేదా రోహిత్​పై చర్యలు తీసుకుంటుందా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది.

రోహిత్ ఏమన్నాడంటే? ఇటీవల కేప్​టౌన్ వేదికగా సౌతాఫ్రికా- భారత్ మధ్య టెస్టు మ్యాచ్ జరిగింది. అయితే కేప్​టౌన్ పిచ్ పూర్తిగా పేసర్లకు సహకరించింది. ఊహించిన దానికంటే బంతి ఎక్కువగా బౌన్స్ అవుతూ, బ్యాటర్లను భయపెడ్డింది. దీంతో ఈ మ్యాచ్​లో పేసర్లు 33 వికెట్లు నేలకూల్చారు. ​ఫలితంగా మ్యాచ్ కేవలం ఒకటిన్నర రోజుల్లనే ముగిసింది. టెస్టు క్రికెట్ చరిత్రలోనే అతి తక్కువ రోజుల్లో ముగిసిన మ్యాచ్ ఇదే కావడం విశేషం.

అయితే మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ ప్రెస్ కాన్ఫరెన్స్​లో పాల్గొన్నాడు. 'ఈ టెస్టులో ఏం జరిగిందో, పిచ్‌ ఎలా ప్రవర్తించిందో అందరూ చూశారు. ఇండియాకు వెళ్లినప్పుడు అక్కడి పిచ్‌ల గురించి మాట్లాడే విషయంలో నోరు మూసుకుని ఉంటే, ఇలాంటి పిచ్‌పై ఆడేందుకు నిజంగానే నాకెలాంటి ఇబ్బంది ఉండదు. ఈ పిచ్‌ చాలా ప్రమాదకరంగా ఉంది. మాకు పెద్ద సవాలు విసిరింది. భారత్‌ పిచ్​లపై కూడా ఇలాంటి సవాలే ఉంటుంది. మేము టెస్టు క్రికెట్‌ ఆడేందుకు వచ్చాం. పిచ్​​ ఎలా ఉన్నా ఆడాల్సిందే. కానీ భారత్‌లో తొలి రోజు నుంచే స్పిన్‌ తిరిగితే అందరు ఏదేదో మాట్లాడతారు. మొదటి రోజు నుంచి బంతి సీమ్‌ అయితే పర్వాలేదు. కానీ బంతి తిరిగితే మాత్రం ఒప్పుకోరా? ఈ విషయంలో తటస్థంగా ఉండాలి. పిచ్‌లకు రేటింగ్‌ ఇచ్చేటప్పుడు రిఫరీలు కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి' అని రోహిత్‌ శర్మ చెప్పాడు.

'విభిన్న పరిస్థితుల్లో ఆడడాన్ని ఛాలెంజింగ్​గా తీసుకోవాలి. విదేశీ జట్లు భారత్​లో ఆడేటప్పుడు పిచ్​ను విమర్శించకుండా, ఛాలెంజ్​ను యాక్సెప్ట్ చేయాలి. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా ప్లేయర్లు వాళ్ల దేశాల్లో కఠిన సవాళ్లు ఎదుర్కొంటూ, భారత్​లోని టర్నింగ్ పిచ్​లను విమర్శిస్తారు. అది మారాలి' అని రోహిత్ అన్నాడు.

టీ20ల్లో రోహిత్, విరాట్ రీ ఎంట్రీ- అఫ్గాన్ సిరీస్​కు జట్టు ప్రకటన

టీ20 వరల్డ్​కప్​ జట్టులో రోహిత్ ఇన్, కోహ్లీ ఔట్​- కెప్టెన్​ ఛాన్స్ అతడికే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.