ETV Bharat / sports

'న్యూజిలాండ్.. పాక్​ క్రికెట్​ను​ చంపేసింది'

author img

By

Published : Sep 18, 2021, 11:14 AM IST

పాకిస్థాన్‌ పర్యటనను భద్రత కారణాలతో న్యూజిలాండ్‌ రద్దు చేసుకున్న నేపథ్యంలో పాక్​ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్(shoaib akhtar comments) కీలక వ్యాఖ్యలు చేశాడు. పాకిస్థాన్​ క్రికెట్​ను న్యూజిలాండ్ చంపేసిందని ట్విట్టర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశాడు.

Shoaib Akhtar
షోయబ్ అక్తర్

18 ఏళ్ల విరామం తర్వాత పాకిస్థాన్‌కు వచ్చిన కివీస్‌.. తొలి వన్డే ఆరంభానికి కొని నిమిషాల ముందు మ్యాచ్​ను రద్దు చేస్తూ.. తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఇదే విషయంపై పాక్​ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్(shoaib akhtar comments).. తన ట్విట్టర్​ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

  • NZ just killed Pakistan cricket 😡😡

    — Shoaib Akhtar (@shoaib100mph) September 17, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అప్పుడు మద్దతిచ్చాం..

పాకిస్థాన్ క్రికెట్​ను న్యూజిలాండ్(Pak vs Nz) చంపేసిందని ట్వీట్ చేశాడు. న్యూజిలాండ్​లో గతంలో జరిగిన పేలుళ్లకు పాక్​ మద్దతుగా నిలిచిందని గుర్తుచేశాడు. క్రైస్ట్​ చర్చ్​లో జరిగిన ఈ బ్లాస్ట్​లో 9 మంది పాకిస్థానీలు మృతిచెందారని తన ట్వీట్​లో పేర్కొన్నాడు.

  • ° This was just an unverified threat, it could have been discussed.

    ° Prime Minister Imran Khan personally spoke to his NZ counterpart and assured but it was still refused.

    ° Pakistan has safely hosted South Africa, Bangladesh, West Indies, Sri Lanka, Zimbabwe & PSL.

    — Shoaib Akhtar (@shoaib100mph) September 17, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"మ్యాచ్​ను(Pak vs Nz) రద్దు చేసుకునేందుకు భద్రతా కారణాలను ఎత్తిచూపిన దృష్ట్యా.. అలాంటి దాడికి సంబంధించిన సంకేతాలు రాలేదు. ఇదే విషయంపై పాక్​ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​.. న్యూజిలాండ్​ ప్రధానితో చర్చించి.. హామీ ఇచ్చినా వాళ్లు వినలేదు. దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, శ్రీలంక, జింబాబ్వే, పీఎస్​ఎల్​ జట్లకు సురక్షితంగా పాక్​ ప్రాతినిధ్యం వహించింది" అని తన ట్విట్టర్​లో తెలిపాడు షోయబ్​.

ఇదీ చదవండి: Pak vs Nz: పాక్​కు క్రికెట్ కష్టాలు మళ్లీ మొదలు..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.