ETV Bharat / sports

'పాక్​తో భారత్ పోటీపడలేదు.. అందుకే మాతో ఆడట్లేదు'

author img

By

Published : Oct 5, 2021, 3:50 PM IST

భారత్-పాకిస్థాన్(ind vs pak 2021) సిరీస్​ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు పాక్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్(abdul razzaq news). పాక్​తో పోటీ పడలేకే టీమ్ఇండియా సిరీస్​కు ఒప్పుకోవట్లేదని తెలిపాడు.

Razzaq
రజాక్

భద్రతా పరమైన కారణాలే కాకుండా ఇరు దేశాల మధ్య నెలకొన్న సందిగ్ధ వాతావరణం వల్ల కొంతకాలంగా భారత్-పాకిస్థాన్(ind vs pak 2021) మధ్య ద్వైపాక్షిక సిరీస్​లు జరగట్లేదు. కేవలం ప్రపంచకప్ వంటి మెగాటోర్నీలో మాత్రమే ఇరుజట్లు తలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు జట్ల మధ్య సిరీస్(ind vs pak 2021)​ జరగాలని చాలాకాలంగా అభిమానులు కోరుకుంటున్నారు. దీనిపై ఇటు భారత క్రికెట్ బోర్డు, అటు పాక్ బోర్డు రకరకాల మాటలు మాట్లాడుతున్నాయి. తాజాగా పాక్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్(abdul razzaq news)​.. భారత జట్టుపై విమర్శలు చేశాడు. పాక్​తో టీమ్ఇండియా సరితూగదంటూ కామెంట్లు చేశాడు.

"పాకిస్థాన్​ జట్టులో ఉన్నట్లు భారత జట్టులో ఆల్​రౌండర్లు, పేసర్లు ఉన్నారా? ఈ విషయంలో రెండు జట్ల మధ్య అసలు పోలికే లేదు. నాకు తెలిసి పాక్​తో భారత్​ పోటీపడలేదు. పాక్ ఆటగాళ్ల సామర్థ్యం భారత్​తో పోలిస్తే భిన్నమైంది. అందుకే వారు పాక్​తో సిరీస్​లో పోటీపడరు. పాక్​లాంటి జట్టును తయారు చేయడం కోసం భారత్ ప్రయత్నిస్తోంది."

-అబ్దుల్ రజాక్, పాక్ క్రికెటర్

దీంతో పాటు భారత జట్టులోని ఆటగాళ్లపైనా కామెంట్లు చేశాడు రజాక్. దిగ్గజ ఆటగాళ్లు పాక్​లోనే ఎక్కువగా ఉన్నారంటూ మాట్లాడాడు.

"భారత్ కూడా గొప్ప జట్టే. వారికి కూడా గొప్ప ఆటగాళ్లు ఉన్నారు. కానీ శక్తి సామర్థ్యాల ప్రకారం చూస్తే పాక్​కు ఇమ్రాన్ ఖాన్ ఉండగా.. భారత్​కు కపిల్ దేవ్ ఉన్నాడు. వీరిద్దరిలో ఇమ్రాన్ కాస్త ఉత్తమం. మాకు వసీమ్ అక్రమ్ కూడా ఉన్నాడు. కానీ అతడి సత్తాతో పోల్చదగిన బౌలర్​ భారత్​లో​ లేడు. మాకు మియాందాద్ ఉంటే వారికి గావస్కర్ ఉన్నాడు. వీరిద్దరి మధ్య అసలు పోలికే లేదు. మాకు ఇంజమామ్, యూసఫ్, యూనిస్ ఉంటే వారికి ద్రవిడ్, సెహ్వాగ్ ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే పాక్​ అత్యుత్తమ క్రికెటర్లను అందించింది. అందుకే పాక్​తో మ్యాచ్​లు ఆడేందుకు భారత్​ ఇష్టపడదు" అంటూ వ్యాఖ్యానించాడు రజాక్.

గత 11 ఏళ్లలో భారత్​-పాక్ 20సార్లు పరిమిత ఓవర్ల మ్యాచ్​ల్లో తలపడగా అందులో 15 మ్యాచ్​ల్లో విజయం సాధించింది టీమ్ఇండియా. త్వరలోనే టీ20 ప్రపంచకప్​(T20 world cup 2021)లో భాగంగా ఈ రెండు జట్లు తలపడనున్నాయి. అక్టోబర్ 24న ఈ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో అబ్దుల్ రజాక్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఇవీ చూడండి: ఆస్ట్రేలియా ఆటగాళ్ల క్రికెట్ కిట్ దొంగలు ఎత్తుకుపోయారట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.