మూడో వన్డేకు ముందు టీమ్​ఇండియాకు షాక్​.. రాహుల్​ ద్రవిడ్​కు అస్వస్థత

author img

By

Published : Jan 13, 2023, 6:36 PM IST

Dravid health condition

మూడో వన్డేకు ముందు టీమ్​ఇండియాకు ఎదురుదెబ్బ తగిలింది. హెడ్ కోచ్​ రాహుల్ ద్రవిడ్​ అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతడు మూడో మ్యాచ్​కు అందుబాటులో ఉండడని తెలిసింది.

శ్రీలంకతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే భారత్ సిరీస్​ను కైవసం చేసుకుంది. అయితే తిరువనంతపురంలో జరిగే మూడో వన్డేకు భారత్ సిద్ధం అవుతుండగా ఊహించని షాక్ తగిలింది. రెండో వన్డే ముందు రోజే తన 50వ జన్మదిన వేడుకలు జరుపుకున్న హెడ్‌కోచ్ రాహుల్ ద్రావిడ్‌ అస్వస్థతకు గురయ్యాడు. బీపీ విపరీతంగా పెరిగిపోవడంతో ట్యాబ్లెట్లు వేసుకుని రెండో మ్యాచ్​లో పాల్గొన్న రాహుల్​.. తాజాగా ఇంటికి వెళ్లిపోయాడు. ఆరోగ్యం బాగలేకపోవడంతోనే తను బెంగళూరు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. దీంతో తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ మైదానంలో జరిగే మ్యాచ్‌కు అతడు అందుబాటులో ఉండటం అనుమానంగా మారింది. అతడి స్థానంలో మాజీ క్రికెట్​ వీవీఎస్ లక్ష్మణ్​ కోచ్​గా వ్యవహరిస్తాడని సమాచారం.

ఇదీ చూడండి: ఆ కేసులో బీసీసీఐ బాస్​ బిన్నీకి క్లీన్ చిట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.