ఒడిశా ఆటగాడికి సీఎస్కే ఆహ్వానం.. ట్రయల్స్​కు రావాలని..

author img

By

Published : Dec 20, 2021, 5:31 AM IST

CSK News Today
చెన్నై సూపర్ కింగ్స్​ ()

CSK IPL: వచ్చే సీజన్​లో కప్పు కొట్టడమే లక్ష్యంగా సీఎస్కే కొత్త ఆటగాళ్ల కోసం వేట మొదలుపెట్టింది. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో పరుగుల వరద కురిపించిన ఒడిశా ఆటగాడు సుభ్రాంశు సేనాపతిని ట్రయల్స్​కు రావాలని కబురు చేసింది.

Subhranshu Senapati CSK: ఐపీఎల్​లో నాలుగు సార్లు ఛాంపియన్​గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్.. వచ్చే సీజన్​కు సమయాత్తమవుతోంది. ఇప్పటికే నలుగురు ప్లేయర్లను రిటెయిన్‌​ చేసుకున్న సీఎస్కే యాజమాన్యం కొత్త ఆటగాళ్ల కోసం వేట ప్రారంభించింది. ఈ క్రమంలో ఒడిశా బ్యాటర్ సుభ్రాంశు సేనాపతికి ఆహ్వానం పలికింది. ట్రయల్స్​కు రావాలని పిలిచింది.

subhranshu senapati ipl team
సుభ్రాంశు సేనాపతి

Subhranshu Senapati IPL Team:

విజయ్ హజారే ట్రోఫీ 2021 లో ఆంధ్రప్రదేశ్​తో మ్యాచ్​తో ఈ ఒడిశా కుర్రాడు వెలుగులోకి వచ్చాడు. ఈ మ్యాచ్​లో ఒడిశాకు గెలవడంలో అతని బ్యాటింగ్​పై ప్రశంసలు అందుకుంది. కేవలం ఏడు మ్యాచ్​ల్లోనే 257 పరుగులు సాధించాడు. అంతేకాకుండా విదర్భ, హిమాచల్​ ప్రదేశ్​లపై సునాయసంగా ఆఫ్​ సెంచరీలు చేశాడు. టీ20ల్లో 637 రన్స్​తో సరాసరి 28.95ను కలిగి ఉన్నాడు. ముస్తాక్ అలీ ట్రోఫీలో ఐదు మ్యాచ్​ల్లోనే 138 రన్స్ సాధించాడు. 116.94 స్ట్రైక్ రేట్​ను కలిగి ఉన్నాడు. ఇతని ఆటతీరుకు మెచ్చి ట్రయల్స్​కు రావాలని పిలిచింది సీఎస్కే.

"విజయ్ హజారే ట్రోఫీ, సయ్యద్ మస్తాక్ అలీ ట్రోఫీలో సేనాపతి ఆటతీరే అతనికి సీఎస్కే ఆహ్వానానికి కారణం."

- సంజయ్ బెహేరా, ఒడిశా క్రికెట్​ అసోసియేషన్ (ఓసీఏ)​

CSK players 2022:

2022 సెషన్​కు సీఎస్కే నలుగురు ప్లేయర్లను రిటెయిన్ చేసుకుంది. రవీంద్ర జడేజాకు రూ.16 కోట్లు వెచ్చించి రిటెయిన్ చేసుకుంది. సీఎస్కే కెప్టెన్ ధోనీకి రూ.12 కోట్లు వెచ్చించింది. రుతురాజ్​కు రూ.6, మొయిన్ అలీకి రూ.8 కోట్లు చెల్లించి రిటెయిన్ చేసుకుంది.

ఇదీ చదవండి:

భారత అండర్-19 కెప్టెన్ గా యశ్ ధుల్- జట్టు ఇదే..

పాకిస్థాన్​కు ఆడిన సచిన్.. మన దేశం కంటే ముందే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.