ETV Bharat / sports

క్రికెట్ రంగంలోకి మైక్రోసాఫ్ట్, అడోబ్!

author img

By

Published : Dec 6, 2020, 4:44 PM IST

Updated : Dec 6, 2020, 5:16 PM IST

వృత్తిపరంగా తమదైన ముద్రవేసిన ప్రముఖ వ్యాపారులు ప్రస్తుతం క్రికెట్ రంగంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, అడోబ్ సీఈవో శంతను నారాయణ్, పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ ఈ దిశగా అడుగులేస్తున్నారు.

satya nadella
క్రికెట్ రంగంలో పెట్టుబడులకు మైక్రోసాఫ్ట్. ఆడోబ్

క్రికెట్​ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ వ్యాపారవేత్తలు సిద్ధమవుతున్నారు. ఈ జాబితాలో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, అడోబ్ సీఈవో శంతను నారాయణ్ ఉన్నారు.

ఇటీవలే కోల్​కతా నైట్ రైడర్స్ సహ యజమాని షారుఖ్ ఖాన్.. అమెరికన్ క్రికెట్ ఎంటర్​ప్రైజెస్ (ఏసీఈ) నిర్వహించనున్న మేజర్ లీగ్ టోర్నీలో పెట్టుబడులు పెట్టినట్లు స్వయంగా వెల్లిడించారు. ఈ నేపథ్యంలో ప్రముఖ వ్యాపారవేత్తలు ఇందులో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఇరువురు ప్రముఖ వ్యాపారవేత్తలతో పాటు పేటీఎం వ్యవస్థాపకుడు విజయ శేఖర్ కూడా ఈ మేజర్​ లీగ్​ టోర్నీలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.

"అమెరికాలో పెద్ద మొత్తంలో ప్రజలు క్రికెట్​ను ఆస్వాదించేందుకు, వారికి ఆసక్తిని పెంచేందుకు ఈ లీగ్​ నిర్వహణకు ముందడుగు వేశాం" అని ఏసీఈ (అమెరికన్ క్రికెట్ ఎంటర్​ప్రైజెస్) ఉప వ్యవస్థాపకుడు విజయ్ శ్రీనివాసన్ వెల్లడించారు.

ఇదీ చదవండి:కరోనా దెబ్బతో రద్దయిన ఇంగ్లాండ్-సౌతాఫ్రికా వన్డే

Last Updated : Dec 6, 2020, 5:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.