టీమ్​ఇండియా టీ20 కెప్టెన్​గా ఆ పేసర్!

author img

By

Published : Nov 7, 2021, 11:45 AM IST

ashish nehra
అశిష్ నెహ్రా ()

టీ20 ప్రపంచకప్​ అనంతరం టీమ్​ఇండియా టీ20 సారథిగా విరాట్​ కోహ్లీ(Virat Captaincy) తప్పుకోనున్న నేపథ్యంలో కొత్త కెప్టెన్​ ఎవరనేదానిపై చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఓ పేసర్​కు ఆ అర్హత ఉందని చెప్పాడు టీమ్​ఇండియా మాజీ ఆటగాడు అశిష్ నెహ్రా(Ashish Nehra News). ఇంతకీ ఆ పేసర్​ ఎవరంటే..

టీ20 ప్రపంచకప్​(T20 world cup) అనంతరం టీమ్​ఇండియా సారథి ఎవరన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. చాలా మంది దిగ్గజాలు కేఎల్ రాహుల్, రోహిత్​ పేర్లు చెబుతున్నారు. మరికొంత మంది పంత్​కు అవకాశమిస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమ్​ఇండియా మాజీ పేసర్ అశిష్ నెహ్రా(Ashish Nehra on Bumrah) కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టులోని ఓ పేసర్​కు సారథి అయ్యే సామర్థ్యం ఉందని అభిప్రాయపడ్డాడు. బుమ్రాను జట్టుకు కెప్టెన్​ చేయాలని సూచించాడు.

"రోహిత్​ శర్మతో పాటు కేఎల్​ రాహుల్, రిషబ్​ పంత్ కెప్టెన్ అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. వీరు అన్ని ఫార్మాట్లలో ఆడి తమ ప్రతిభను చాటారు. కొన్నిసార్లు జట్టు నుంచి కూడా డ్రాప్ అయిన సందర్భాలున్నాయి. అయితే.. పేసర్ బుమ్రా కూడా టీమ్​ తరఫున అన్ని ఫార్మాట్లలో ఆడాడు. ఆటను బాగా అర్థం చేసుకోగలడు. పేసర్లు కెప్టెన్​ అవకూడదు అని ఎక్కడా లేదు."

--అశిష్ నెహ్రా, మాజీ ఆటగాడు.

మరో వారం తర్వాత భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) టీ20 జట్టుకు కొత్త కెప్టెన్​ ఎవరనేదానిపై స్పష్టత ఇవ్వనుంది. త్వరలోనే న్యూజిలాండ్​తో 3 టీ20లు, రెండు టెస్టు మ్యాచ్​లు ఆడనుంది భారత జట్టు. ఈ నేపథ్యంలో నెహ్రా వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.

ఇదీ చదవండి:

'న్యూజిలాండ్​పై అఫ్గాన్​ గెలిస్తే.. ఆ అనుమానాలు ఖాయం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.