ETV Bharat / sitara

సాయితేజ్​కు కౌన్సిలింగ్​ ఇద్దామనుకున్నా.. కానీ: నరేశ్​

author img

By

Published : Sep 11, 2021, 1:27 PM IST

Updated : Sep 11, 2021, 1:43 PM IST

రోడ్డు ప్రమాదానికి గురైన సాయిధరమ్​ తేజ్(saidharam tej accident)​ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు సీనియర్​ నటుడు నరేశ్​. అయితే ప్రమాదం జరగడానికి ముందు తేజ్​ తన ఇంటి నుంచే బయలుదేరాడని అన్నారు. నాలుగు రోజుల క్రితం బండి స్పీడ్​గా నడపకూడదని తేజ్​కు కౌన్సెలింగ్​ ఇవ్వాలని తాను అనుకున్నట్లు తెలిపారు.

naresh
నరేశ్​

రోడ్డు ప్రమాదం జరగడానికి ముందు సాయిధరమ్‌ తేజ్‌(saidharam tej accident) తన ఇంటి నుంచే బయలుదేరాడని నటుడు నరేశ్‌ తెలిపారు. తన కుమారుడు నవీన్‌ విజయ కృష్ణకు సాయితేజ్‌ మంచి స్నేహితుడని చెప్పారు. సాయి వేగంగా కోలుకుని ఆరోగ్యంగా తిరిగి రావాలని దేవుడిని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు నరేశ్‌ ఓ స్పెషల్‌ వీడియో రిలీజ్‌ చేశారు.

నరేశ్​

"సాయిధరమ్‌ తేజ్‌ నా బిడ్డలాంటివాడు. తను కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. నా కుమారుడు నవీన్‌ విజయ కృష్ణ-సాయి మంచి స్నేహితులు. అన్నదమ్ముల్లా ఉంటారు. నిన్న సాయంత్రం వాళ్లిద్దరూ ఇక్కడి నుంచే బయలుదేరారు. బైక్‌పై స్పీడ్‌గా వెళ్లొద్దని చెప్పాలనుకుని బయటకు వచ్చేసరికే.. వాళ్లు బయలుదేరిపోయారు. నాలుగు రోజుల క్రితం కూడా వీళ్లిద్దరికీ కౌన్సెలింగ్‌ ఇవ్వాలనుకున్నాను. కానీ కుదరలేదు. పెళ్లి-కెరీర్‌తో జీవితంలో సెటిల్‌ కావాల్సిన వయసు ఇది. ఇలాంటి సమయంలో ఈ విధమైన రిస్క్‌లు తీసుకోకుండా ఉండటమే మంచిది. గతంలో నేను కూడా బైక్‌ డ్రైవింగ్‌కు వెళ్లి ప్రమాదానికి గురయ్యాను. మా అమ్మ ఒట్టు వేయించుకోవడంతో ఆనాటి నుంచి బైక్స్ జోలికి పోలేదు. ఆస్పత్రికి వెళ్లి పరామర్శించాలనుకున్నాను. కాకపోతే పరిస్థితుల దృష్ట్యా అక్కడికి వెళ్లలేకపోతున్నాను. త్వరలోనే కలుస్తాను"

-నరేశ్‌, సీనియర్​ నటుడు.

కాసేపటి క్రితం అపోలో ఆస్పత్రి.. తేజ హెల్త్​ బులెటిన్​ను(Saidharam tej health condition) విడుదల చేసింది. 'సాయి తేజ్‌ ఆరోగ్యం నిలకడగా ఉంది. ప్రధాన అవయవాలు బాగానే పనిచేస్తున్నాయి. ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నాం. ఈ రోజు మరిన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తాం' అని అపోలో ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.

సహ నటులతో కలిసి..!

ఇదిలా ఉంటే.. వీకెండ్​లలో సహ నటులతో కలిసి సాయిధరమ్​ తేజ్​ పార్టీలకు హాజరవుతాడని సమాచారం. హీరో సందీప్​ కిషన్​, వైవా హర్ష, సీనియర్​ నటుడు నరేష్​ కుమారుడు నవీన్​తో కలిసి తేజ్​ రైడింగ్​కు వెళ్లేవాడట. ఐటీసీ కోహినూర్​ వెనకాల తేజ్​ రెగ్యులర్​గా రైడ్​ చేసేవాడట. ఈ క్రమంలో శుక్రవారం వెళుతుండగా.. ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి: సాయిధరమ్​ తేజ్​ను పరామర్శించిన సినీప్రముఖులు

Last Updated :Sep 11, 2021, 1:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.