ETV Bharat / international

బంగ్లాదేశ్ విజయ్ దివస్​లో కోవింద్.. 1971 నాటి 'మిగ్' బహూకరణ

author img

By

Published : Dec 16, 2021, 11:11 AM IST

KOVIND BANGLADESH
KOVIND BANGLADESH

Ramnath kovind in Bangladesh: బంగ్లాదేశ్​ ఢాకాలో నిర్వహించిన విజయ్ దివస్ కార్యక్రమంలో భారత రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ పాల్గొన్నారు. బంగ్లాదేశ్ సైనికుల పరేడ్​ను వీక్షించారు.

Ramnath kovind in Bangladesh: పాకిస్థాన్​తో 1971లో జరిగిన యుద్ధంలో విజయానికి 50 వసంతాలు పూర్తైన నేపథ్యంలో బంగ్లాదేశ్​లో నిర్వహించిన విజయ్ దివస్ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ పాల్గొన్నారు. ఢాకాలో నిర్వహించిన నేషనల్ పరేడ్​ను వీక్షించారు.

Ramnath kovind in Bangladesh
సైనిక కవాతును వీక్షిస్తున్న రాష్ట్రపతి కోవింద్. పక్కనే షేక్ హసీనా
Ramnath kovind in Bangladesh
సైనిక కవాతు

Bangladesh vijay diwas:

బంగ్లాదేశ్ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్​.. ఆ దేశ సైనికుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Ramnath kovind in Bangladesh
పరేడ్​ను వీక్షిస్తున్న బంగ్లా అధ్యక్షుడు
Ramnath kovind in Bangladesh
సైనిక కవాతు

ఈ సందర్భంగా కోవింద్.. 1971 కాలం నాటి మిగ్ 21 యుద్ధవిమానం ప్రతిరూపాన్ని అబ్దుల్ హమీద్​కు బహూకరించారు. ఇరుదేశాల సైన్యాలు చేసిన త్యాగానికి గుర్తుగా దీన్ని అందించినట్లు భారత విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా తెలిపారు.

మూడు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ బంగ్లాదేశ్​కు వెళ్లారు. ఢాకాలో నిర్వహించే 50వ 'విజయ్ దివస్' వేడుకల్లో భారత్​ తరఫున గౌరవ అతిథిగా హాజరు కావాలని కోవింద్​ను బంగ్లాదేశ్ అధ్యక్షుడు ఆహ్వానించారు. పర్యటనలో భాగంగా బుధవారం షేక్ హసీనాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బహుముఖ, సమగ్రమైన ద్వైపాక్షిక సంబంధాల పురోగతిపై ఇరుపక్షాలు సమీక్షించినట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది.

ఇదీ చదవండి: 'కలిసి పోరాటం చేశాము.. అణచివేత శక్తులను ఓడించాము'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.