ETV Bharat / international

కరోనా దెబ్బకు 1962 తర్వాత ఇరాన్​ తొలిసారి..

author img

By

Published : Mar 12, 2020, 7:31 PM IST

Updated : Mar 12, 2020, 9:34 PM IST

1962 తర్వాత ​తొలిసారి రుణం తీసుకోనుంది ఇరాన్​. కరోనాతో పోరాడేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి 5 బిలియన్​ డాలర్ల అప్పు కోరినట్లు ప్రకటించింది ఆ దేశం​​.

Iran asks IMF for first loan in decades to combat virus
కరోనా దెబ్బకు 1962 తర్వాత ఇరాన్​ తొలిసారి...

అమెరికా ఆంక్షలతో ఇన్నేళ్లు ఉక్కిరిబిక్కరి అయిన ఇరాన్​కు తాజాగా కరోనా సెగ తగలింది. ఈ మహమ్మారిపై యుద్ధం ప్రకటించింది ఇరాన్​. కానీ సరిపడా నిధులు లేక విలవిలలాడుతోంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్​ఎఫ్​) సంస్థను ఆశ్రయించింది. వైరస్​ను ఎదుర్కొనేందుకు అత్యవసరంగా 5 బిలియన్​ డాలర్ల అప్పు కావాలని కోరింది. ఇలా అప్పు కోరడం.. ఇరాన్​కు 1962 తర్వాత ఇదే తొలిసారి.

5 బిలియన్​ డాలర్ల అప్పు కోరుతూ ఇరాన్​ కేంద్ర బ్యాంకు చీఫ్​ అబ్దోల్​ నాస్సర్​.. ఐఎమ్​ఎఫ్​ అధిపతి క్రిస్టలీనాకు గత వారం లేఖ రాశారు. రాపిడ్ ఫినాన్షియల్ ఇన్​స్ట్రుమెంట్ ద్వారా కరోనా బాధిత దేశాలను ఆదుకుంటామని ఇది వరకే ప్రకటించింది అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ.

వైరస్​ను ఎదుర్కొనేందుకు ప్రత్యేక వైద్య వసతులు ఏర్పాటు చేయాల్సివస్తోంది. మాస్క్​లు, శానిటైజర్లు, ఐసోలేషన్​ వార్డులు, కరోనా పరీక్షా కేంద్రాలు వంటివి ఏర్పాటు చేస్తోంది ఇరాన్​ ప్రభుత్వం. ఫలితంగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది.

పెరుగుతున్న మృతుల సంఖ్య...

ఓ వైపు వైరస్​ కట్టడికి ఇరాన్​ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్నప్పటికీ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా 75 మంది ఈ మహమ్మారి వల్ల ప్రాణాలు కోల్పోయారు. దేశంలో మొత్తం మృతుల సంఖ్య 429 కి చేరింది. ఇప్పటివరకు 10 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.

ఇదీ చదవండి:ట్రంప్​తోపాటు ఆ దేశాధినేతకూ కరోనా ముప్పు!

Last Updated : Mar 12, 2020, 9:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.