ETV Bharat / international

కరోనా కట్టడిలో సహకారంపై భారత్​-బంగ్లా చర్చ

author img

By

Published : Aug 19, 2020, 2:45 PM IST

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ.. బంగ్లాదేశ్​లో రెండురోజుల పర్యటనకు వెళ్లారు భారత విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్​ ష్రింగ్లా. ఇందులో భాగంగా ఆ దేశ ప్రధాని షేక్​ హసీనాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కరోనా కట్టడికి సహకారం, కరోనా తర్వాత ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ సహా కీలక విషయాలపై చర్చించారు.

India, Bangladesh discuss cooperation on COVID-19 assistance
కరోనా కట్టడికి సహకారంపై భారత్​-బంగ్లా చర్చ

కరోనాను కట్టడి చేసేందుకు సహాయసహకార మార్గాలపై భారత్​, బంగ్లాదేశ్​ చర్చించాయి. వైరస్​ చికిత్స, టీకాతో సహా కరోనా తర్వాత ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణపైనా ఇరు దేశాల మధ్య చర్చ జరిగినట్లు అధికారవర్గాలు తెలిపాయి.

కరోనా మహమ్మారి వ్యాప్తి తర్వాత తొలిసారి బంగ్లాదేశ్​లో రెండురోజుల పర్యటనకు వెళ్లారు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్​ ష్రింగ్లా. బంగ్లా​ ప్రధానమంత్రి షేక్​ హసీనాతో భేటీ అయ్యారు. ఇరుదేశాల భద్రతాపరమైన అంశాలు, వ్యాపారులు, అధికారుల ప్రయాణ ఏర్పాట్లకు ప్రతిపాదన, వైద్య పరికరాల రవాణాపైనా చర్చించించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

" ఇరుదేశాల సంబంధాల బలోపేతం, కరోనా తర్వాత ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ, కరోనా చికిత్స, వ్యాక్సిన్​తో సహా కొవిడ్​ కట్టడిలో సహకారం, బంగ్లాదేశ్​ వ్యవస్థాపకుడు షేక్​ ముజిబ్​ రెహ్మాన్​ శతజయంతి ఉత్సవాన్ని సంయుక్తంగా నిర్వహించటం వంటి అంశాలపై చర్చించారు. భారత రైల్వే గత నెల 10 బ్రాడ్​గేజ్​ డీజిల్​ లోకోమోటివ్​లను బంగ్లాదేశ్​కు పంపటంపై కృతజ్ఞతలు తెలిపారు హసీనా. త్వరలోనే వర్చువల్​గా జరగబోయే విదేశాంగ మంత్రుల సమావేశంపైనా ఇరువురు చర్చించారు."

- అధికారవర్గాలు

ఇదీ చూడండి: పాక్ ఆర్మీ చీఫ్​కు సౌదీలో ఘోర పరాభవం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.