ETV Bharat / crime

ఈ క్రికెట్ మ్యాచ్ చాలా హాట్ గురూ.. రూ.850 టికెట్, బ్లాక్ లో రూ.11వేలు

author img

By

Published : Sep 25, 2022, 7:58 PM IST

BLOCK TICKETS IN CRICKET MATCH
BLOCK TICKETS IN CRICKET MATCH

BLOCK TICKETS IN CRICKET MATCH : ఉప్పల్​ వేదికగా జరగనున్న భారత్‌-ఆస్ట్రేలియా మధ్య చివరి టీ 20 మ్యాచ్‌లో బ్లాక్‌ టికెట్ల విక్రయాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బ్లాక్‌లో టికెట్స్‌ విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను ఎల్బీనగర్‌ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు.

BLOCK TICKETS IN CRICKET MATCH : ఇవాళ ఉప్పల్‌ వేదికగా భారత్‌-ఆస్ట్రేలియా మధ్య చివరి టీ 20 మ్యాచ్‌ జరుగుతుంది. ఈ నేపథ్యంలో స్టేడియం పరిసరాల్లో బ్లాక్‌ టికెట్ల విక్రయాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బ్లాక్‌లో టికెట్స్‌ విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను ఎల్బీనగర్‌ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 6 టికెట్లు, మూడు సెల్‌ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను గుగులోత్‌ వెంకటేశ్‌, ఇస్లవత్ దయాకర్‌, గుగులోత్‌ అరుణ్‌గా గుర్తించారు. నిందితులు రూ.850 టికెట్లను రూ.11 వేలకు అమ్ముతుండగా పట్టుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

మరోవైపు ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సిరీస్‌లో నిర్ణయాత్మక మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. తొలి టీ20లో ఓడినప్పటికీ.. రెండో మ్యాచ్‌లో గెలిచిన భారత్‌ సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఈ మ్యాచ్‌లోనూ నెగ్గి సిరీస్‌ కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. దాదాపు మూడేళ్ల తర్వాత ఉప్పల్‌ మైదానంలో మ్యాచ్‌ జరుగుతుండటంతో హైదరాబాద్‌ అభిమానులు ఎంతో ఆతృతగా ఈ మ్యాచ్‌ కోసం ఎదురుచూస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.