ETV Bharat / crime

చిలుకలూరిపేటలో భారీగా రేషన్ బియ్యం సీజ్

author img

By

Published : Mar 31, 2021, 12:33 PM IST

అక్రమంగా తరలిస్తున్న 150 బస్తాల బియ్యం సీజ్
అక్రమంగా తరలిస్తున్న 150 బస్తాల బియ్యం సీజ్

నిత్యం ఎక్కడో ఓ చోట అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం వాహనాలు పట్టు పడుతూనే ఉన్నాయి. పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని ఓవైపు పౌరసరఫరాల అధికారులు చెబుతున్నా.. మరోవైపు ఆచరణలో అమలు కావడం లేదు. తాజాగా గుంటూరు జిల్లా చిలకలూరిపేట శాంతి నగర్​లో బుధవారం ఉదయం మినీ లారీలో తరలిస్తున్న 150 బస్తాల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణం శాంతినగర్​లో 150 బస్తాల రేషన్ బియ్యాన్ని అర్బన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాహన యజమాని నాగార్జునపై కేసు నమోదు చేశారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి సేకరించి తెచ్చిన బియ్యాన్ని అక్రమంగా లారీలో తరలించేందుకు సిద్ధంగా ఉంచగా పోలీసులు పట్టుకోగా.. డ్రైవర్ పరారయ్యాడు. సీజ్ చేసిన లారీని పట్టణ ఠాణా వద్దకు తరలించామని అర్బన్ ఏఎస్ఐ బ్రహ్మం తెలిపారు.

ఇవీ చూడండి : నేడు పోలవరంలో రెండోరోజు సంయుక్త నిపుణుల కమిటీ పర్యటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.