గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణం శాంతినగర్లో 150 బస్తాల రేషన్ బియ్యాన్ని అర్బన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాహన యజమాని నాగార్జునపై కేసు నమోదు చేశారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి సేకరించి తెచ్చిన బియ్యాన్ని అక్రమంగా లారీలో తరలించేందుకు సిద్ధంగా ఉంచగా పోలీసులు పట్టుకోగా.. డ్రైవర్ పరారయ్యాడు. సీజ్ చేసిన లారీని పట్టణ ఠాణా వద్దకు తరలించామని అర్బన్ ఏఎస్ఐ బ్రహ్మం తెలిపారు.
ఇవీ చూడండి : నేడు పోలవరంలో రెండోరోజు సంయుక్త నిపుణుల కమిటీ పర్యటన