ETV Bharat / crime

ద్విచక్రవానాన్ని ఢీ కొట్టిన కారు.. ఒకరు మృతి

author img

By

Published : Feb 9, 2021, 3:38 PM IST

road accident in Anantapur district one died
ద్విచక్రవానాన్ని ఢీ కొట్టిన కారు.. ఒకరు మృతి

లారీని ఓవర్​టేక్​ చేస్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్న కారు... ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. అనంతపురం జిల్లా బత్తలపల్లిలో జరిగిన ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు.

ద్విచక్ర వాహనాన్ని కారు ఢీ కొట్టింది. ఈ ఘటన.. అనంతపురం జిల్లా బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రి వద్ద జాతీయ రహదారిపై జరిగింది. ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. జిల్లాలోని తాడిమర్రి మండలం మరిమాకుల పల్లి గ్రామానికి చెందిన గోపాల్ నాయుడు పని నిమిత్తం ద్విచక్ర వాహనంపై అనంతపురం బయల్దేరాడు.

లారీని ఓవర్ టేక్ చేసే సమయంలో ఎదురుగా వచ్చిన కారు అతని మోటారు సైకిల్​ను వేగంగా ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన గోపాల్​ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ధర్మవరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి:

ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను ఒప్పుకునేది లేదు: మంత్రి ముత్తంశెట్టి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.