ETV Bharat / crime

కాకినాడ జిల్లాలో విషాదం.. ఎడిబుల్​ ఆయిల్‌ ట్యాంక్​లోకి దిగి ఏడుగురు కార్మికులు మృతి

author img

By

Published : Feb 9, 2023, 10:13 AM IST

Updated : Feb 9, 2023, 10:57 AM IST

SEVEN WORKERS DIED
SEVEN WORKERS DIED

10:09 February 09

కాకినాడ జిల్లాలో విషాదం..ఎడిబుల్​ ఆయిల్‌ ట్యాంక్​లో దిగి ఏడుగురు కార్మికులు మృతి

SEVEN WORKERS DIED : కాకినాడ జిల్లాలోని.. అంబటి సుబ్బన్న ఆయిల్‌ ఫ్యాక్టరీలో ప్రమాదానికి ఏడుగురు బలయ్యారు. పెద్దాపురం మండలం జి.రాగంపేటలో నిర్మాణంలో ఉన్న ఫ్యాక్టరీ ఆవరణలో ప్రమాదం చోటు చేసుకుంది. ఎడిబుల్​ ఆయిల్‌ ట్యాంకర్‌.. శుభ్రం చేసేందుకు ఏడుగురు కార్మికులు ఒకరి తర్వాత ఒకరు లోపలికి దిగారు. అందులో ఊపిరాడక అందరూ మృత్యువాత పడ్డారు . మృతుల్లో.. ఐదుగురిని పాడేరు వాసులుగా,. ఇద్దరిని పెద్దాపురం మండలం పులిమేరు వాసులుగా గుర్తించారు. మృతుల్లో పాడేరు వాసులుగా.. వెచ్చంగి కృష్ణ, వెచ్చంగి నరసింహ, సాగర్, కె.బంజుబాబు, కుర్రా రామారావు.. పులిమేరుకు చెందినవారిగా కట్టమూరి జగదీశ్‌, ప్రసాద్​లను గుర్తించారు. ప్రమాదానికి సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని.. ప్రమాదంపై ఆరా తీశారు.

ఇవీ చదవండి:

Last Updated :Feb 9, 2023, 10:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.