సాగర తీరం విశాఖలో కాంటినెంటల్ కప్ బీచ్ వాలీబాల్ పోటీలు కనువిందు చేస్తున్నాయి. రాష్ట్ర వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో మన దేశంతో పాటు శ్రీలంక, కజకిస్థాన్, ఇరాన్ దేశాల క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మొత్తం ఆరు దేశాలు పాల్గొనాల్సి ఉన్నప్పటికీ పాకిస్థాన్, బంగ్లాదేశ్లు పోటీలకు దూరంగా ఉన్నాయి. మూడు రోజులపాటు జరుగనున్న పోటీలు రేపటితో ముగియనున్నాయి. గెలుపొందిన క్రీడాకారులను ఒలింపిక్స్ జోనల్ పోటీలకు ఎంపిక చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఇవీ చూడండి: