ETV Bharat / city

Live Videos: తెదేపా కార్యాలయాలపై దాడి..కార్లు, ఫర్నీచర్ ధ్వంసం

author img

By

Published : Oct 19, 2021, 7:34 PM IST

తెదేపా కార్యాలయాలపై దాడి
తెదేపా కార్యాలయాలపై దాడి

రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మునుపెన్నడూ లేని విధంగా రాజకీయాల్లో కొత్త సంస్కృతి మొదలైంది. పార్టీ కార్యాలయాలపైనే ప్రత్యక్ష దాడులు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్​పై తెదేపా నేతల వ్యాఖ్యలను నిరసిస్తూ వైకాపా శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో తెదేపా కార్యాలయాలు, నేతల నివాసాలపై దాడులకు తెగబడ్డారు.

గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లదాడికి పాల్పడ్డారు. దాడిలో కార్యాలయం అద్దాలు ధ్వంసమయ్యాయి. తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడిని నిరసిస్తూ తెదేపా శ్రేణులు జాతీయరహదారిపై ఆందోళనకు దిగారు. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయమేర్పడింది. వైకాపా మహిళా కార్యకర్తలు విశాఖలోని తెదేపా కార్యాలయంలోకి చొచ్చుకెళ్లారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటి ముట్టడికి యత్నించారు. దీంతో పోలీసులు వైకాపా శ్రేణులను అదుపులోకి తీసుకున్నారు.

మంగళగిరి తెదేపా కార్యాలయంలో విధ్వంసం

పట్టాభి ఇంట్లో వీరంగం..

విజయవాడలోని తెదేపా అధికార ప్రతినిధి పట్టాభి నివాసంపై దాడిచేసిన వైకాపా శ్రేణులు ఇంటి ఆవరణలోని కారు, ద్విచక్రవాహనం, ఇంట్లోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. దాదాపు 200 మంది ఒక్కసారిగా ఇంటిపై దాడికి దిగారని పట్టాభి కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు. పట్టాభి దొరికితే చంపేస్తామంటూ పెద్దగా కేకలు వేస్తూ ఇంట్లోని ఫర్నిచర్‌ మొత్తం ధ్వంసం చేశారని తెలిపారు. వైకాపా మహిళా కార్యకర్తలు విశాఖలోని తెదేపా కార్యాలయంలోకి చొచ్చుకెళ్లారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటి ముట్టడికి యత్నించారు. దీంతో పోలీసులు వైకాపా శ్రేణులను అదుపులోకి తీసుకున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో తెదేపాకు వ్యతిరేకంగా వైకాపా శ్రేణులు నినాదాలు చేశారు. తెదేపా నేత లింగారెడ్డి ఇంటిని ముట్టడించేందుకు వైకాపా శ్రేణులు యత్నించారు.

పట్టాభి ఇంటిపై దాడి

లింగారెడ్డి ఇంటి ముందు ఆందోళన

కడప జిల్లా ప్రొద్దుటూరులో తెదేపా కడప పార్లమెంటు అధ్యక్షుడు లింగారెడ్డి ఇంటి ముందు వైకాపా నేతలు ఆందోళన చేపట్టారు. ముఖ్యమంత్రిపై పట్టాభి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళనకు దిగారు. తెదేపాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తెదేపా నేతలు చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని వైకాపా కార్యకర్తలు డిమాండ్ చేశారు. లింగారెడ్డి తన ఇంటి నుంచి బయటకు రావడంతో కాస్త ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు కలుగజేసుకొని వైకాపా కార్యకర్తలను అక్కడి నుంచి పంపించేశారు.

ప్రొద్దుటూరులో వైకాపా శ్రేణుల ఆందోళన

గవర్నర్‌కు చంద్రబాబు ఫోన్‌

రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా కార్యాలయాలపై దాడులకు సంబంధించి తెదేపా అధినేత చంద్రబాబు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. దాడుల విషయాన్ని గవర్నర్‌కు వివరించారు. అనంతరం కేంద్ర హోంశాఖ అధికారులతో మాట్లాడిన చంద్రబాబు రాష్ట్రంలో పరిణామాలు వివరించారు. కేంద్ర బలగాల సాయం కోరారు. బలగాలు పంపేందుకు కేంద్ర హోంశాఖ సానుకూలంగా స్పందించినట్టు తెదేపా వర్గాలు వెల్లడించాయి.

ఇదీ చదవండి

తెదేపా కార్యాలయాలపై వైకాపా శ్రేణలు దాడులు.. గవర్నర్​కు చంద్రబాబు ఫోన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.