ETV Bharat / city

'పల్లా శ్రీనివాస్ భవనాన్ని క్షక్షతోనే కూల్చేశారు'

author img

By

Published : Apr 26, 2021, 4:40 PM IST

yanamala putta comments on palla house issue
క్షక్షతోనే పల్లా శ్రీనివాస్ భవనాన్ని కూల్చేశారు

జగన్ సీఎం అయినప్పటి నుంచి బీసీలపై దాడి ప్రారంభించారని తెదేపా సీనియర్ నేతలు యనమల, పుట్టా సుధాకర్ యాదవ్​లు ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల కబ్జాకు వ్యతిరేకంగా పల్లా శ్రీనివాస్ పోరాడినందుకే కక్షగట్టి ఆయన భవనాన్ని కూల్చేశారన్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల కబ్జాకు వ్యతిరేకంగా పల్లా శ్రీనివాస్ పోరాడినందుకే కక్షగట్టి ఆయన భవనాన్ని కూల్చేశారని తెదేపా సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, పుట్టా సుధాకర్ యాదవ్​లు ఆరోపించారు. ప్రభుత్వ అనుమతులతోనే పల్లా శ్రీనివాస్ కాంప్లెక్స్ భవన నిర్మాణం చేపట్టారని.., నోటీసులు ఇవ్వకుండా కూల్చటం చట్ట వ్యతిరేకమన్నారు. జగన్ సీఎం అయినప్పటి నుంచి బీసీలపై దాడి ప్రారంభించారని, ఈ దుర్మార్గాల్ని బడుగు, బలహీన వర్గాలు ఖండించి తగు రీతిలో బుద్ధి చెప్పాలని కోరారు.


ఏ మంత్రిని తొలగిస్తారు: వర్ల రామయ్య
"రామతీర్థ కోదండరామాలయ నిర్వహణ సరిగా లేదని, దేవాలయ ఛైర్మన్​గా అశోక గజపతిరాజును తొలగించారు. ఆక్సిజన్ సరిగా అందక, విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా రోగులు మరణించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరిని తొలగిస్తారు. జిల్లా మంత్రి బొత్స సత్యనారాయణనా ? లేక ఆరోగ్య మంత్రి ఆళ్ల నానినా ?" అని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ప్రశ్నించారు.

ఇదీచదవండి: విశాఖలో అలజడి.. తెదేపా నేత పల్లా శ్రీనివాస్ భవనం కూల్చివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.