ETV Bharat / city

గన్నవరం చేరుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. స్వాగతం పలికిన గవర్నర్​

author img

By

Published : Jul 15, 2022, 10:25 AM IST

VICE PRESIDENT
VICE PRESIDENT

VICE PRESIDENT: భారత ఉపరాష్ట్రపత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు గన్నవరం చేరుకున్నారు. ఆత్కూరు స్వర్ణభారత్ ట్రస్ట్​లో జాతీయకవి దామరాజు 'పుండరీకాక్షుడు' పుస్తకాన్ని వెంకయ్య ఆవిష్కరించనున్నారు.

VICE PRESIDENT: రెండు రోజుల పర్యటన నిమిత్తం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విజయవాడ వచ్చారు. గన్నవరం విమానాశ్రయంలో వెంకయ్యనాయుడికి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, మంత్రి జోగి రమేష్, మాజీమంత్రి కామినేని శ్రీనివాస్, ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్ట్​కు వెళ్లారు. జాతీయకవి దామరాజు 'పుండరీకాక్షుడు' పుస్తకాన్ని వెంకయ్య ఆవిష్కరించనున్నారు. సాయంత్రం 5 గంటలకు విజయవాడ మారిస్ స్టెల్లా కళాశాల వజ్రోత్సవంలో పాల్గొంటారు. రేపు ఉదయం ప్రత్యేక విమానంలో దిల్లీ వెళ్లనున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.