ETV Bharat / city

CBI-ED Case: ఐఏఎస్ శ్రీలక్ష్మిపై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ

author img

By

Published : Sep 23, 2021, 5:59 PM IST

Updated : Sep 23, 2021, 7:57 PM IST

ఐఏఎస్ శ్రీలక్ష్మిపై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ
ఐఏఎస్ శ్రీలక్ష్మిపై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ

17:55 September 23

జగన్ అక్రమాస్తుల కేసు విచారణ

హైదరాబాద్‌ సీబీఐ, ఈడీ కోర్టులో ఇవాళ జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ జరిగింది. దాల్మియా కేసు విచారణకు రానందుకు ఐఏఎస్‌ శ్రీలక్ష్మీపై సీబీఐ కోర్టు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. పెన్నా కేసులో సీబీఐ కోర్టుకు హాజరైన రిటైర్డ్‌ ఐఏఎస్‌ వెంకట్రామిరెడ్డిపై కోర్టు ఎన్‌బీడబ్ల్యూ రీకాల్‌ చేసింది. వాన్‌పిక్‌ కేసులో మోపిదేవి, బ్రహ్మానందరెడ్డి గైర్హాజయ్యారు. మోపిదేవి, బ్రహ్మానందరెడ్డి లాయర్లు రాకుంటే ఉత్తర్వులు ఇస్తామని కోర్టు హెచ్చరిచింది.  

జగన్‌, విజయసాయి పిటిషన్లపై కౌంటర్లకు సీబీఐ, ఈడీ గడువు కోరింది. వాన్‌పిక్‌, దాల్మియా కేసుల విచారణ తోపాటు జగతి పబ్లికేషన్స్‌, పెన్నా సిమెంట్స్‌ కేసుల విచారణను ఈనెల 30కి వాయిదా వేసింది.  

ఇదీ చదవండి

కొప్పర్రు ఘటనపై డీజీపీకి చంద్రబాబు లేఖ

Last Updated :Sep 23, 2021, 7:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.