ETV Bharat / city

కస్తూరి పూర్ణ చంద్ర ట్రస్ట్ సేవలు ప్రశంసనీయం: ఎంపీ కేశినేని

author img

By

Published : Jan 16, 2021, 10:02 AM IST

Kasturi purna chandra Trust
కస్తూరి పూర్ణ చంద్ర ట్రస్ట్ సేవలు

ఎంత కూడబెట్టామని చెప్పుకోవడం కన్నా.... సంపాదించిన దానిలో తోచినంత నలుగురికి సహాయం చేయడమే మిన్న అంటున్నారు.... విజయవాడకి చెందిన వల్లూరి వారి కుటుంబ సభ్యులు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడం అందరి బాధ్యతగా చెబుతున్నారు.

కస్తూరి పూర్ణ చంద్ర ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలతో ముందుకి వెళుతున్న వల్లూరి రవీంద్ర, వల్లూరి అశోక్ బాబును.... విజయవాడ లోక్​సభ సభ్యుడు కేశినేని నాని అభినందించారు. బృందావన్ కాలనీలోని ఫకీర్ గూడెంలో కరోనా బారిన పడి, అసువులు బాసిన 8 పేద కుటుంబాలకు తమవంతు సాయంగా ఒక్కో కుటుంబానికి 10వేల రూపాయలను.. ఎంపీ కేశినేని నాని చేతుల మీదుగా సాయం అందించారు. ముందు ముందు మరిన్ని సేవాకార్యక్రమాలు నిర్వహిస్తామని అశోక్ బాబు తెలియజేశారు. ఆర్థిక సహాయం పొందినవారు.... కస్తూరి పూర్ణ చంద్ర ట్రస్ట్ సేవలపై సంతోషం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

కోస.. బంగారు కాసు ఒకే ధర!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.