ETV Bharat / city

CBN: 'పీఆర్​సీ జాడే లేదు..సీపీఎస్ రద్దు ఊసే లేదు '

author img

By

Published : Jul 14, 2021, 8:22 PM IST

Updated : Jul 14, 2021, 9:04 PM IST

చంద్రబాబు నాయుడు
చంద్రబాబు నాయుడు

ప్రభుత్వ ఉద్యోగులంటే జగన్​రెడ్డికి ఎందుకంత చులకనని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. కేంద్రప్రభుత్వం ఉద్యోగులకు 11 శాతం డీఏ ఇస్తుంటే..రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం 7 డీఏలను పెండింగ్​లో పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వ ఉద్యోగులంటే జగన్​రెడ్డికి ఎందుకంత చులకన అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు 11శాతం డీఏ ప్రకటించిందన్న చంద్రబాబు.. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ఎప్పుడు లేనివిధంగా 7 డీఏలు పెండింగ్​లో పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పీఆర్సీ ఊసేలేదని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో రద్దు చేస్తానన్న సీపీఎస్ జాడలేదని విమర్శించారు. కరోనా విపత్తు సమయంలోనూ ప్రాణాలకు తెగించి పోరాడుతున్న ఉద్యోగుల విషయంలో ప్రభుత్వ దాటవేత ధోరణి సరికాదని హితవు పలికారు.

  • రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులంటే ఎందుకంత చులకన?
    కేంద్రప్రభుత్వం ఉద్యోగులకు 11శాతం డిఎ ప్రకటించింది.రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎప్పుడు లేనివిధంగా 7 డిఎలు పెండింగ్ లో పెట్టారు.పిఆర్ సి ఊసేలేదు, అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో రద్దు చేస్తానన్న సిపిఎస్ జాడలేదు.(1/2)

    — N Chandrababu Naidu (@ncbn) July 14, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి:

jagan bail: 'జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌'పై.. కీలక పరిణామం!

Last Updated :Jul 14, 2021, 9:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.