ETV Bharat / city

'జగన్ ధన దాహం వల్లే ఎల్జీ పాలిమర్స్ ఘటన'

author img

By

Published : May 11, 2020, 3:30 PM IST

జగన్ ధన దాహం వల్లే ఎల్జీ పాలిమర్స్ ఘటన చోటు చేసుకుందని తెదేపా నేత బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. లాక్​డౌన్​లో అత్యవసర పరిశ్రమలకు మాత్రమే అనుమతిస్తారని పేర్కొన్నారు.

bonda uma fires on cm jagan about lg polymers
bonda uma fires on cm jagan about lg polymers

విశాఖ ప్రమాదంపై దేశం మొత్తం నివ్వెరపోతే జగన్ మాత్రం ఆ కంపెనీ ప్రతినిధులతో ఎయిర్‌పోర్ట్‌ లాంజ్​‌లో బేరాలు మాట్లాడుకున్నారని తెదేపా నేత బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. రూ.300 కోట్లకు డీల్ కుదరడం వల్లే ఎవరినీ అరెస్టు చేయలేదని పేర్కొన్నారు. లాక్​డౌన్‌లోనూ జే టాక్స్‌ కోసం మద్యం అమ్ముతున్నారని బొండా ఉమా విమర్శించారు. ప్రజాధనంతో మద్యం అమ్మకాలకు పాల్పడుతూ కోట్లు ఖర్చుపెట్టి ప్రకటనలు ఇస్తున్నారని దుయ్యబట్టారు.

ఇదీ చదవండి: మూడు రోజుల్లో మిగతావారికీ ఆర్థిక సాయం అందాలి: సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.