ETV Bharat / city

TOP NEWS: ప్రధానవార్తలు @3PM

author img

By

Published : Nov 15, 2021, 3:00 PM IST

3PM TOPNEWS
ప్రధానవార్తలు @3PM

.

  • ప్రజా వ్యతిరేకతను కప్పి పుచ్చుకోవడానికి.. ఇన్ని కుట్రలా? - చంద్రబాబు
    ప్రజా వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి ఇన్ని కుట్రలా చేయాలా అని.. వైకాపా ప్రభుత్వాన్ని తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. ఇంత దారుణ పనులు చేస్తే.. చరిత్ర హీనులుగా మిగిలిపోతారని అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • చంద్రబాబు కుప్పం రాకుండా చూడండి.. ఎస్ఈసీకి వైకాపా ఫిర్యాదు!
    కుప్పం ఎన్నికల్లో తెదేపా అక్రమాలకు పాల్పడుతోందంటూ.. రాష్ట్ర ఎన్నికల సంఘానికి వైకాపా ఫిర్యాదు చేసింది. అంతేకాదు.. చంద్రబాబును కుప్పం రాకుండా నిలువరించాలని విజ్ఞప్తి చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • INDRAKEELADRI: నేటినుంచి ఇంద్రకీలాద్రిపై.. భవానీ దీక్షలు ప్రారంభం
    ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షలు నేటి చి ప్రారంభమయ్యాయి. ఆలయ అధికారులు భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లనూ పూర్తి చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • chain snatching: కృష్ణాజిల్లాలో.. వరుస చోరీల కలకలం
    కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గ పరిధిలో ఆదివారం గంటల వ్యవధిలో జరిగిన గొలుసు చోరీలు స్థానికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'ఎంపీ ఇంటిపై కాల్పులు నా పనే'.. పోలీసులకు లొంగిపోయిన బాలుడు!
    భాజపా ఎంపీ రంజీతా కోలీ నివాసంపై కాల్పులకు ఓ బాలుడు బాధ్యత వహించాడు. ఈ మేరకు పోలీసులకు ఆదివారం ఫోన్​చేసి చెప్పాడు. బాలున్ని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'మాజీ జడ్జి పర్యవేక్షణలో లఖింపుర్ కేసు దర్యాప్తు'
    లఖింపుర్​ ఖేరి కేసు దర్యాప్తుపై బుధవారం ఆదేశాలు జారీ చేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. సిట్​ బృందంలో సీనియర్​ ఐపీఎస్​ అధికారులకు చోటు కల్పించాలని, వారి పేర్లను మంగళవారం సమర్పించాలని యూపీ ప్రభుత్వానికి సూచించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • అమెరికా ఆయుధాలతో తాలిబన్ల బల ప్రదర్శన
    అఫ్గాన్​లో అధికారం చేపట్టిన తాలిబన్లు.. అమెరికా, ఇతరదేశాల దళాలు వదిలేసి వెళ్లిన ఆయుధాలతో ఆదివారం బల ప్రదర్శన(Taliban military parade) నిర్వహించారు. తాలిబన్‌ దళాల్లో 250 మంది సైనికులు కొత్తగా శిక్షణ పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కవాతు నిర్వహించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • వరుసగా ఏడోసారి రెండంకెలపైనే టోకు ద్రవ్యోల్బణం
    టోకు ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ)(Wpi inflation) అక్టోబరులో 12.54 శాతంగా నమోదైంది. డబ్ల్యూపీఐ రెండంకెలపైన నమోదవడం వరుసగా ఇది ఏడో నెల కావడం గమనార్హం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • టీమ్​ఇండియా మాజీ కోచ్​ రవిశాస్త్రికి కొత్త బాధ్యతలు!
    టీమ్​ఇండియా మాజీ కోచ్​ రవిశాస్త్రి కొత్త బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. రవిశాస్త్రి లెజెండ్స్​ లీగ్​ క్రికెట్​కు (Legends League Cricket) కమిషనర్​గా వ్యవహరించనున్నట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • కమల్​ నిర్మాతగా విజయ్​-విక్రమ్​ మల్టీస్టారర్​ సినిమా!
    కోలీవుడ్​ స్టార్​ హీరోలు విజయ్​సేతుపతి, విక్రమ్​ కలిసి మల్టీస్టారర్​ సినిమా చేయనున్నారని సమాచారం. దీన్ని యూనివర్సల్​ స్టార్​ కమల్​హాసన్​ నిర్మించనున్నారని తెలిసింది. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన వచ్చే అవకాశముంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.