ETV Bharat / bharat

'ఎంపీ ఇంటిపై కాల్పులు నా పనే'.. పోలీసులకు లొంగిపోయిన బాలుడు!

author img

By

Published : Nov 15, 2021, 1:04 PM IST

భాజపా ఎంపీ రంజీతా కోలీ నివాసంపై కాల్పులకు ఓ బాలుడు బాధ్యత వహించాడు. ఈ మేరకు పోలీసులకు ఆదివారం ఫోన్​చేసి చెప్పాడు. బాలున్ని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.

bharatpur mp ranjeeta koli
భాజపా ఎంపీపై కాల్పులు

రాజస్థాన్​లో భాజపా ఎంపీ రంజీతా కోలీ నివాసంపై కాల్పులు తానే జరిపానని ఓ బాలుడు బాధ్యత వహించాడు. ఈ మేరకు పోలీసులకు ఆదివారం ఫోన్​చేసి చెప్పాడు. బాలుడ్ని కస్టడీలోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

"ఓ బాలుడు కంట్రోల్​ రూమ్​కు ఆదివారం ఫోన్ చేశాడు. రంజితా కోలీ ఇంటిపై కాల్పులు జరిపి, బెదిరింపు లేఖలు ఆమె నివాసంపై అంటించింది తానేనని ఒప్పుకున్నాడు. బాలుడ్ని అదుపులోకి తీసుకున్నాము. కానీ అతని మానసిక పరిస్థితి బాగాలేనట్లు కనిపిస్తోంది. అతని మాటలు నమ్మశక్యంగా లేవు."

-బనయా సీఓ అజయ్​ శర్మ​

భరత్​పుర్​ జిల్లా, బనయాలో ఉన్న భాజపా ఎంపీ రంజీతా కోలీ నివాసంపై గత మంగళవారం దుండగులు కాల్పులు జరిపారు. అంతేకాకుండా బెదిరింపులతో కూడిన లేఖను ఇంటికి (attack on bjp leaders in rajasthan) అతికించారు. ఈ ఘటనపై పోలీసు ప్రత్యేక బృందాలు దర్యాప్తు ప్రారంభించాయి.

ఇదీ చదవండి: చంపేస్తామని బెదిరించి.. ఎంపీ నివాసంపై కాల్పులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.