ETV Bharat / city

చంద్రబాబు కుప్పం రాకుండా చూడండి.. ఎస్ఈసీకి వైకాపా ఫిర్యాదు!

author img

By

Published : Nov 15, 2021, 1:43 PM IST

కుప్పం ఎన్నికల్లో తెదేపా అక్రమాలకు పాల్పడుతోందంటూ.. రాష్ట్ర ఎన్నికల సంఘానికి వైకాపా ఫిర్యాదు చేసింది. అంతేకాదు.. చంద్రబాబును కుప్పం రాకుండా నిలువరించాలని విజ్ఞప్తి చేసింది.

YSRCP COMPLAINT to sec
YSRCP COMPLAINT to sec

రాష్ట్ర ఎన్నికల సంఘానికి వైకాపా ఫిర్యాదు చేసింది. తెదేపా అక్రమాలకు పాల్పడుతోందంటూ తమ ఫిర్యాదులో పేర్కొంది. కుప్పంలో వారం రోజులుగా తెదేపా అక్రమాలకు పాల్పడుతోందని వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఎస్ఈసీకి ఫిర్యాదు చేశారు.

చంద్రబాబు కుప్పానికి వెళ్లాల్సిన అవసరమేంటని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబును కుప్పానికి వెళ్లకుండా నిలువరించాలని కోరారు. తమ ఫిర్యాదుపై ఎన్నికల అధికారులు సానుకూలంగా స్పందించినట్లు అప్పిరెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి:

ఎస్ఈసీ కార్యాలయం ముందు భారీగా మోహరించిన పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.