ETV Bharat / city

మునుగోడు ఓటర్ల జాబితా పిటిషన్‌పై విచారణ.. హైకోర్టు ఏం చెప్పిందంటే?

author img

By

Published : Oct 14, 2022, 12:56 PM IST

Munugode
మునుగోడు ఓటర్ల జాబితా పిటిషన్‌పై విచారణ

TS High Court on Munugode voter list: తెలంగాణలోని మునుగోడు ఓటర్ల జాబితాపై దాఖలైన పిటిషన్​ను ఆ రాష్ట్ర హైకోర్టు విచారించింది. ఓటర్ల జాబితా ప్రకటించకుండా ఆదేశాలిచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. మునుగోడు ఓటరు జాబితాపై తదుపరి విచారణ ఈనెల 21కి వాయిదా వేసింది.

TS High Court on Munugode voter list: మునుగోడు ఉప ఎన్నికల ఓటర్ల జాబితా పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. ఓటర్ల జాబితా ప్రకటించకుండా ఆదేశాలిచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఓటర్ల జాబితా సవరణపై నివేదిక రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కోర్టుకు సమర్పించారు. 2018 అక్టోబరు 12న మునుగోడు ఓటర్లు 2,14,847 ఉన్నట్లు సీఈవో తెలిపారు. ఈనెల 11 నాటికి మునుగోడు ఓటర్లు 2,38,759 ఉన్నారని వెల్లడించారు. 25,013 కొత్త ఓటర్లు దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. 12,249 కొత్త ఓటర్లకు అనుమతించి..7247 తిరస్కరించామని కోర్టుకు చెప్పారు. మునుగోడు ఓటరు జాబితా సవరణ నేటితో పూర్తవుతుందని వివరించారు.

మునుగోడులో ఓటర్లు అసాధారణంగా పెరిగినట్లు కనిపించడం లేదని ధర్మాసనం పేర్కొంది. జాబితా ప్రకటించాక అభ్యంతరాలు ఉంటే తెలపవచ్చని ధర్మాసనం పేర్కొంది. మునుగోడు ఓటరు జాబితాపై తదుపరి విచారణ ఈనెల 21కి వాయిదా వేసింది.

అసలేం జరిగిదంటే: మునుగోడులో ఓట్ల నమోదుకు సంబంధించి హైకోర్టులో భాజపా రిట్‌ పిటిషన్ దాఖలు చేసింది. ఉపఎన్నికకు జులై 31 వరకు ఉన్న జాబితానే పరిగణించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరింది. తక్కువ సమయంలోనే మునుగోడులో 25 వేల దరఖాస్తులు వచ్చాయని పేర్కొంది. ఫాం-6 కింద వచ్చిన దరఖాస్తుల్లో తప్పుడు ఓటర్లు ఉన్నారని ఆరోపించింది. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టింది.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.