ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 7PM

author img

By

Published : Jul 2, 2021, 7:01 PM IST

ప్రధాన వార్తలు @ 7PM
ప్రధాన వార్తలు @ 7PM

.

  • కొత్తగా 3,464 కరోనా కేసులు, 35 మరణాలు

రాష్ట్రంలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 93,759 మంది నమూనాలు పరీక్షించగా 3,464 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి 35 మంది మృతి చెందారు. తాజాగా కరోనా నుంచి 4,284 మంది కోలుకున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • Zero FIR: జీరో ఎఫ్​ఐఆర్​కు విస్తృత ప్రచారం కల్పించాలి: సీఎం జగన్

ప్రతిపాదిత "దిశ" చట్టం అమలుపై ముఖ్యమంత్రి జగన్ అధికారులతో సమీక్షించారు. మహిళలు ఫిర్యాదుల కోసం పోలీస్‌ స్టేషన్లకు వెళ్లాల్సిన అవసరం లేకుండా..గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా పోలీసులకే ఫిర్యాదు చేసేలా చూడాలని సీఎం ఆదేశించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • శ్రీగంధం తోటల్లో...మత్తు పదార్థాల తయారీ

కాశం జిల్లా త్రిపురాంతకం మండలం కె.అన్నసముద్రం గ్రామ సమీపంలోని 20 ఎకరాలు లీజు(leaze)కు తీసుకుని శ్రీగంధం తోటలు వేశారు. తోట మధ్యలో రేకుల షెడ్ నిర్మించి ఓ పరిశ్రమను స్థాపించారు. ఈ షెడ్​లో మత్తుమందు(drugs) తయారు చేస్తున్నట్లు గుంటూరు జిల్లా సెబ్(seb) అధికారులు గుర్తించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • 'జగన్ పాలనలో విశ్వవిద్యాలయాలు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారాయి'

రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన విశ్వవిద్యాలయాలను.. జగన్ రెడ్డి పాలనలో రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చారని నారా లోకేశ్ మండిపడ్డారు. 11 కేసుల్లో నిందితుడుగా ఉన్న A2 రెడ్డి జన్మదిన వేడుకలు.. ఆంధ్ర విశ్వవిద్యాయలంలో నిర్వహించటం దారుణమన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • 'భారత సైన్యం సత్తా ఏంటో చైనాకు అర్థమైంది'

భారత సైనిక దళాలను తేలికగా తీసుకోరాదన్న విషయం చైనాకు అర్థమైందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ అన్నారు. భారత్​-చైనా తూర్పు లద్దాఖ్​లో యథాతథస్థితిని నెలకొల్పాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • Supreme Court: మంత్రి గురించి ప్రధాని చూసుకుంటారు!

మంత్రుల పనితీరు వ్యవహారాన్ని ప్రధానమంత్రి చూసుకుంటారని తెలిపింది సుప్రీం కోర్టు. అందుకు సంబంధించిన అంశాల్లో న్యాయస్థానాలేమీ చేయలేవని వ్యాఖ్యానించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • 'కరోనా 2.0 కథ ముగియలేదు.. తేలికగా తీసుకుంటే...'

కరోనా రెండో దశ ముప్పు ఇంకా తొలగిపోలేదని కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరించింది. వేగంగా టీకా పంపిణీతో పాటు.. కరోనా నిబంధనలను విధిగా పాటిస్తేనే మహమ్మారి ముప్పు నుంచి బయటపడగలమని ఉద్ఘాటించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • చేతిలో పేలిన గ్రనేడ్​- ముగ్గురు చిన్నారులు బలి

నిషేధిత చేతి గ్రెనేడ్​తో ఆడుకుంటుండగా.. అది పేలి శుక్రవారం ముగ్గురు చిన్నారులు చనిపోయారు. ఈ దుర్ఘటన పాకిస్థాన్​లోని సమస్యాత్మక ఖైబర్​ పఖ్తుంఖ్వాలో జరిగింది. రాష్ట్రంలో ఈ తరహా ప్రమాదం జరగడం నెల తిరగకుండానే ఇది రెండోసారి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • Corona Effect: భారత్​లో జరగాల్సిన కామన్వెల్త్ గేమ్స్ రద్దు

కొవిడ్​ దెబ్బకు మరో అంతర్జాతీయ టోర్నీ రద్దయింది. ఈ విషయాన్ని కామన్వెల్త్ గేమ్స్ ఇండియా ప్రకటించింది. ఈ విషయం తమను ఎంతో బాధిస్తోందని తెలిపింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • రివ్యూ: 'హసీన్​ దిల్​రుబా' ఎలా ఉందంటే?

తాప్సీ (tapsee), విక్రాంత్ మాస్సే ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం 'హసీన్ దిల్​రుబా'(Haseen Dillruba). కరోనా కారణంగా నెట్​ఫ్లిక్స్​ ఓటీటీలో రిలీజ్​ అయ్యింది. వినీల్​ మ్యాథ్యూ దర్శకత్వంలో రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్​గా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా? పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.