ETV Bharat / city

'ఆ విషయం తెలిసుంటే 'ఆంగ్లం' నిర్ణయం తీసుకునేవారు కాదు'

author img

By

Published : Nov 10, 2019, 10:54 AM IST

'తెలుగు భాష  గొప్పదనం తెలుసుంటే 'ఆంగ్లం' నిర్ణయం తీసుకునేవారు కాదు'

తెలుగు భాష, సంస్కృతిని ఎలా కాపాడుకోవాలో వైకాపా నాయకత్వం.. తెలంగాణ సీఎం కేసీఆర్ నుంచి పాఠాలు నేర్చుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సూచించారు. హైదరాబాద్‌లో 2017 లో నిర్వహించిన ‘తెలుగు మహాసభల’ కోసం 'తొలిపొద్దు'అనే పుస్తకాన్ని తీసుకువచ్చారని ట్వీట్ చేశారు.

ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని నిషేధించాలనే ఏపీ ప్రభుత్వ విధానం.. తన గ్రంథాలయంలోని ‘తెలుగు పుస్తకాలను ఎంతో ఆరాధనతో, ప్రేమతో, శ్రద్ధతో చూసేలా చేసిందని జనసేనాని అన్నారు. తెలుగు భాష గొప్పదనాన్ని నిజంగా అర్థం చేసుకుని ఉంటే..ఆంగ్ల విధానం నిర్ణయం తీసుకునే వారు కాదని అభిప్రాయపడ్డారు. భాష, సంస్కృతిని ఎలా కాపాడుకోవాలో వైకాపా నాయకత్వం... తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి పాఠాలు నేర్చుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా పలు తెలుగు పుస్తక ముఖ చిత్రాలను పవన్ తన ట్విట్టర్ ఖాతాలో పొస్ట్ చేశారు.

pawan kalyan omn implementation of english mediun in ap goverment schools
'తెలుగు భాష గొప్పదనం తెలుసుంటే 'ఆంగ్లం' నిర్ణయం తీసుకునేవారు కాదు'

ఇవీ చూడండి-అన్నదాతల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్​కు నాలుగో స్థానం

Intro:Body:Conclusion:

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.