ETV Bharat / city

నేడు ఇంటర్మీడియట్ అడ్వాన్స్​డ్ సప్లిమెంటరీ ఫలితాలు

author img

By

Published : Oct 23, 2021, 7:21 AM IST

Updated : Oct 23, 2021, 7:30 AM IST

inter results
inter results

ఇవాళ ఇంటర్మీడియట్ అడ్వాన్స్​డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయి. సాయంత్రం 5 గంటలకు అధికారులు పరీక్ష ఫలితాలను ప్రకటిస్తారు.

ఇంటర్మీడియట్‌ మొదటి, రెండు సంవత్సరాల అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను శనివారం సాయంత్రం 5గంటలకు విడుదల చేయనున్నట్లు బోర్డు కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ఈ ఏడాది మొదటిసారిగా ప్రయోగాత్మకంగా వృత్తి విద్య, కొన్ని మైనర్‌ సబ్జెక్టులను ఆన్‌లైన్‌(ఆన్‌ స్క్రీన్‌)లో మూల్యాంకనం చేశారు.

ఈ నెల 26 నుంచి నవంబరు 2 వరకు సమాధాన పత్రాల పునఃలెక్కింపు, పరిశీలనకు అవకాశం కల్పించారు. పునఃలెక్కింపునకు పేపర్‌కు రూ.260, స్కాన్‌కాపీ, పునఃపరిశీలనకు పేపర్‌కు రూ.1,300 చెల్లించాల్సి ఉంటుంది. దీనికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. స్కానింగ్‌ జవాబు పత్రాలను ఆన్‌లైన్‌లోనే అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి ఏడాది పరీక్షలకు జనరల్‌, వృత్తి విద్య విద్యార్థులు 3,24,800 మంది, రెండో ఏడాది పరీక్షలకు సాధారణ, వృత్తి విద్య కలిపి 14,950 మంది హాజరయ్యారు.

ఫలితాలను http://bie.ap.gov.in, http://examresults.ap.nic.in, http://results.apcfss.in వెబ్‌సైట్ల ద్వారా..www.eenadu.net లోను తెలుసుకోవచ్చు. షార్ట్‌ మెమోలను ఈ నెల 25న సాయంత్రం ఐదు గంటల నుంచి bie.ap.gov.in నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఇదీ చదవండి: contract professors: కొలువులేమో ఒప్పందం.. సమస్యలే శాశ్వతం.. అమలు కాని కనీస టైంస్కేలు

Last Updated :Oct 23, 2021, 7:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.