భారత చిత్రపటంలో అమరావతి విషయంపై హోంమంత్రి అమిత్ షా, సహాయమంత్రి కిషన్రెడ్డికి చంద్రబాబు లేఖ రాశారు. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈనెల 2న విడుదల చేసిన మ్యాప్లో అమరావతి లేకపోవడంతో ప్రజలు ఆవేదన చెందారని... లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. ప్రధాని శంకుస్థాపన చేసిన రాజధాని లేకపోవడం బాధించిందన్నారు. తమ ఎంపీలు చెప్పిన వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టినందుకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి:రాష్ట్ర రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ మ్యాప్ విడుదల