ETV Bharat / city

రాజధాని శంకుస్థాపన స్థలిలో ప్రణమిల్లిన చంద్రబాబు

author img

By

Published : Dec 17, 2020, 3:45 PM IST

chandra babu
chandra babu

ఉద్ధండరాయునిపాలెంలో అమరావతికి శంకుస్థాపన చేసిన ప్రాంతంలో మట్టికి తెదేపా అధినేత చంద్రబాబు సాష్టాంగ నమస్కారం చేశారు. అలాగే యాగశాలలో హోమం జరిగిన ప్రాంతంలో మోకాళ్లపై ప్రణమిల్లి ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

తెదేపా అధినేత చంద్రబాబు ఉద్ధండరాయునిపాలెంలో అమరావతికి శంకుస్థాపన చేసిన ప్రదేశాన్ని గురువారం సందర్శించారు. ప్రధాని మోదీ ఆవిష్కరించిన శిలాఫలకాన్ని పరిశీలించారు. యాగశాలలో హోమం జరిగిన ప్రదేశం వద్దే మోకాళ్లపై ప్రణమిల్లి ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఆ తరువాత శంకుస్థాపనలో భాగంగా నవరత్నాలు పెట్టిన ప్రదేశాన్ని తిలకించారు. అలాగే శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో మట్టికి సాష్టాంగ నమస్కారం చేశారు. చంద్రబాబు వెంట అచ్చెన్నాయుడు, మాజీ ఎమ్మెల్యే శ్రావణ్‌ తదితరులు ఉన్నారు.

ఇదీ చదవండి

పోలీసుల హైడ్రామా మధ్య జనభేరి సభకు చంద్రబాబు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.