ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @9PM

author img

By

Published : Jun 2, 2022, 8:59 PM IST

AP TOP NEWS
AP TOP NEWS

.

  • ప్రధాని మోదీతో సీఎం జగన్​ భేటీ.. ఏం చర్చించారంటే..!
    ముఖ్యమంత్రి జగన్.. ప్రధాని మోదీతో దిల్లీలో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఉన్న పెండింగ్ అంశాలతో పాటు రాష్ట్రపతి ఎన్నికపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఆత్మకూరు ఉపఎన్నికపై వైకాపా సవాళ్లు నీచం: చంద్రబాబు
    రివర్స్ టెండర్ల విధానంతో పోలవరం ప్రాజెక్టును రివర్స్ చేశారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఆత్మకూరు ఉపఎన్నికపై వైకాపా సవాళ్లు నీచంగా ఉన్నాయన్నారు. చనిపోయిన కుటుంబసభ్యులకే సీటు ఇస్తే.. పోటీ వద్దనేది తెదేపా విధానమని గుర్తు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రాబోయే 3 రోజులు మండనున్న ఎండలు
    రాబోయే 3 రోజులు.. రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ప్రజలు వీలైనంతవరకు ఇంట్లోనే ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • తిరుమలలో నడకదారి భక్తుల ఇక్కట్లు..
    తిరుమలలో నడకదారి భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శ్రీవారి మెట్టు మార్గంవైపు వచ్చిన భక్తుల లగేజీ బ్యాగులు తిరుమలకు రాకపోవడంతో వారు ఆందోళనకు గురయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'ఆధార్‌తో ప్రభుత్వానికి రూ.2 లక్షల కోట్లు ఆదా'
    కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు పునాదిలా నిలుస్తోన్న ఆధార్‌తో నకిలీలను గుర్తించడం ద్వారా ప్రభుత్వానికి రూ.2లక్షల కోట్లకుపైగా ఆదా అయినట్లు నీతి ఆయోగ్​ సీఈఓ అమితాబ్​ కాంత్​ తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆధార్​ ఓ పునాదిలా మారిందన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'ద కశ్మీర్​ ఫైల్స్​' రిపీట్​.. హిందువులే లక్ష్యంగా ఉగ్ర దాడులు!
    కశ్మీర్‌లో హిందువులే లక్ష్యంగా దాడులు అంతకంతకూ తీవ్రమవుతున్నాయి. ఉగ్రవాదులు స్థానికేతర ప్రభుత్వ ఉద్యోగులను వరుసగా హత్య చేస్తూనే ఉన్నారు. 15 రోజుల వ్యవధిలో ఇద్దరు ఉపాధ్యాయులను కాల్చిచంపిన ముష్కరులు.. తాజాగా ఓ బ్యాంకు మేనేజర్‌ను బలితీసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • క్వీన్​ ఎలిజబెత్​-2 పాలనకు 70ఏళ్లు..
    బ్రిటన్​ సింహాసనాన్ని క్వీన్​ ఎలిజబెత్​-2 అధిష్ఠించి 70 ఏళ్లు పూర్తైన సందర్భంగా ప్లాటినమ్​ జూబ్లీ వేడుకలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. బ్రిటీష్​ మిలిటరీ సంప్రదాయం ప్రకారం గుర్రాల, ఆయుధాలు, ఫైటర్​ జెట్లతో ప్రదర్శన చేపట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మార్కెట్లకు లాభాలు.. సెన్సెక్స్ 437 ప్లస్
    స్టాక్​ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా బలమైన సంకేతాలతో సెన్సెక్స్ 437, నిఫ్టీ 105 పాయింట్లకుపైగా లాభపడ్డాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఫ్రెంచ్​​ ఓపెన్​లో భారత్​కు నిరాశే..
    ఫ్రెంచ్​ ఓపెన్​ సెమీఫైనల్స్​లో బోపన్న-మిడ్డెల్​కూప్​ జోడీ పరాజయం పొందింది. మెన్స్​ డబుల్స్​ విభాగంలో తొలి సెట్​లో రాణించిన ఈ జోడీ.. ఆ తర్వాత సెట్లలో తడబడింది. దీంతో వీరిపై ప్రత్యర్థి రోజర్​-అరేవాలో విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'కేకే'కు కన్నీటి వీడ్కోలు..
    ప్రఖ్యాత గాయకుడు కేకేకు అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు పలికారు. ముంబయిలోని తన ఇంటి సమీపంలోని హిందూ శ్మశానవాటిలో కుటుంబ సభ్యులు, అభిమానులు, స్నేహితులు.. కేకేకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.